మద్దతు వ్యూహం.. భవితకు అభయం
లోక్సభ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకుల మద్దతుపై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ఓట్లు రాబట్టాలంటే కచ్చితంగా సొంత పార్టీలో ప్రభావితం చేయగల నేతల సహకారం ఉండాలని భావిస్తున్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులపై అభ్యర్థుల దృష్టి
ఈనాడు, కరీంనగర్ : లోక్సభ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకుల మద్దతుపై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ఓట్లు రాబట్టాలంటే కచ్చితంగా సొంత పార్టీలో ప్రభావితం చేయగల నేతల సహకారం ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సెగ్మెంట్ల వారీగా విశ్లేషించుకుంటూనే, పోలింగ్ కేంద్రాల వారీగా ముఖ్య నాయకుల తీరుపై దృష్టి సారిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 5 నుంచి 10 మంది ముఖ్యుల పేర్లను నమోదు చేసుకుని వారితో అభ్యర్థులు నేరుగా మాట్లాడుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీ వారిపైనా నజర్
ఇప్పుడిప్పుడే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో అక్కడక్కడ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో రంగులు మారే రాజకీయంలో తమదే పైచేయి కావాలని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం మొదట సొంత పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వారి ఆసక్తికి అనుగుణంగా నడుచుకుంటామని చెబుతూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని భరోసానిస్తున్నారు. అదే సమయంలో ఎదుటి పార్టీలో కీలకమైన నాయకులపైనా దృష్టి పెడుతున్నారు. తమ పార్టీలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుందంటూ రాయ‘బేరాలు’ సాగిస్తున్నారు. సొంత పక్షంలో అసంతృప్తిగా ఉంటూ కినుక వహించే వారిపై ప్రత్యేక ఆసక్తి చూపుతూ తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన చేస్తున్నారు.
ఎవరికి వారు భరోసా
- రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కీలక నాయకులను గుర్తించి నామినేటెడ్ సహా ప్రత్యక్ష ఎన్నికల్లో, పార్టీ పదవుల్లో అవకాశమిస్తామంటూ భరోసానిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో జోరు చూపిస్తోంది.
- నిజామాబాద్, కరీంనగర్లలో సిట్టింగ్ ఎంపీలున్న భాజపా కూడా ద్వితీయ శ్రేణి నాయకులను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్రంలో మరోసారి అధికారం ఖాయమని చెబుతూ పక్క పార్టీల కన్నా ఇక్కడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తోంది.
- భారాస కూడా ఉనికి కాపాడుకునే యత్నంలో రెండో స్థాయి నేతలకు అండగా ఉంటామని హామీ ఇస్తోంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి రాబోయే కాలంలో ప్రాధాన్యం ఉంటుందని చెబుతోంది.
‘జర ఈ ఎన్నికల్లో నాకు సహకరించండి. కచ్చితంగా మీ సేవలను గుర్తుంచుకుంటా. భవిష్యత్తులో పార్టీపరంగా ఎలాంటి అవకాశమున్నా మీకే ప్రాధాన్యమిచ్చేలా చూస్తాను. దయచేసి సంపూర్ణ మద్దతు అందించండి’.
-ద్వితీయ శ్రేణి నాయకుడికి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి విన్నపం.
‘ఎలాగైనా సరే.. ఈసారి ఆ గ్రామంలో మంచి పట్టున్న ఆ నాయకుడి సహకారం మనకే కావాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో అక్కడి పోలింగ్ బూత్లో మనకు మంచి ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ నాయకుడు మన వెన్నంటే ఉండాలి. ఇతర పార్టీల వైపునకు వెళ్లకుండా కాపాడుకోవాలి.’
-సొంత పార్టీ నాయకుడి మద్దతు కోసం మరో అభ్యర్థి యత్నం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం