స్మార్ట్సిటీ తెచ్చిన ఘనత వినోద్కుమార్ది
ఉద్యమకాలం నుంచి నేటి వరకు భారాసకు కరీంనగర్ పుట్టినిల్లని, రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేసినా ఇక్కడి ప్రజలు ఆయన్ను గుండెలకు హత్తుకొని గెలిపించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
రాంపూర్(కరీంనగర్), న్యూస్టుడే: ఉద్యమకాలం నుంచి నేటి వరకు భారాసకు కరీంనగర్ పుట్టినిల్లని, రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేసినా ఇక్కడి ప్రజలు ఆయన్ను గుండెలకు హత్తుకొని గెలిపించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కరీంనగర్ రాంనగర్లో భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారాస కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్కు స్మార్ట్సిటీని, కరీంనగర్-మనోహరాబాద్ రైల్వేలైన్ను, జాతీయ రహదారులను తీసుకొచ్చిన ఘనత వినోద్కుమార్ది అని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే ఎంపీ సంజయ్కుమార్ అయిదేళ్లలో సాధించింది ఏమి లేదన్నారు. పేదల కోసం కేంద్రం చేసింది చెప్పమంటే భాజపా వారు ఇంటికో చిత్రపటం, క్యాలెండర్లను పంచుతున్నారని తెలిపారు. అవి ఆకలి తీరుస్తాయా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 13 హామీల అమలుపై తాను, ఎమ్మెల్యే కమలాకర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు తాను పోరాడగా, అయిదేళ్లలో ఎంపీగా సంజయ్ దాన్ని తీసుకురావడంలో విఫలమయ్యారని తెలిపారు. ఎంపీగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారని, ఎంపీ పదవి ఆయనకు పునరావాస కేంద్రమా? అని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే కరీంనగర్లో అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు. 330 ఎకరాల భూమిని కొండగట్టు ఆలయానికి తాము కేటాయిస్తే ఎంపీ సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేయర్ వై.సునీల్రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్, మాజీ మేయర్ రవీందర్సింగ్, భారాస జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, చల్లహరిశంకర్, డిప్యూటీ మేయర్ స్వరూపారాణి, భారాస కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు హరీశ్రావు మంకమ్మతోటలోని పాత లేబర్ అడ్డా నుంచి రాంనగర్ వరకు రోడ్షో నిర్వహించారు.
వినోద్కుమార్కే గెలుపు అవకాశాలు
రాంపూర్(కరీంనగర్) : పార్లమెంట్ ఎన్నికల్లో భారాసకే అనుకూలంగా ఉందని, సర్వేలన్నీ కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు పేర్కొన్నారు. కరీంనగర్లోని ఓ హోటల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, ముఖ్య నాయకులతో శుక్రవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు.
ర్యాలీలో పాల్గొన్న జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం