అనుమతి లేకుండానే వైద్య సేవలు
జిల్లాలో నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వైద్య సేవలందిస్తున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
రాష్ట్ర వైద్య మండలి ఆదేశాలు బేఖాతరు
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం : జిల్లాలో నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వైద్య సేవలందిస్తున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్ర వైద్య మండలి స్పందించి నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకునే వారే లేరు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బృందాలు పలు దవాఖానాలు తనిఖీ చేశామని చెబుతున్నాయి. కానీ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడంలేదు.
అధికారుల బృందం పరిశీలించాక...
జిల్లాలో 400కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, క్లినిక్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి పూర్తి స్థాయి అనుమతులు లేవు. జిల్లా వ్యాప్తంగా 40కి పైగా దవాఖానాలు అనుమతుల రెన్యూవల్ లేకుండానే నడిపిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ నుంచి శాశ్వత అనుమతి, రెన్యూవల్ పొందాలి. ఇప్పటికీ కొన్ని తాత్కాలిక అనుమతులతోనే పూర్తి స్థాయి సేవలు అందిస్తున్నాయి. సరైన భవనం, నిపుణులైన వైద్యులు, అర్హతగల సిబ్బంది, సదుపాయాలు ఉన్నాయా? లేదా అనేది అధికారుల బృందం పరిశీలించి నిర్ధారించాలి. ఆ తర్వాతే అనుమతి ఇవ్వాలి. కానీ ఈ తతంగం అంతా మొక్కుబడిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మొక్కుబడి తనిఖీలు..
కొన్ని ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదు. రోగ నిర్ధారణ కేంద్రాల్లో కొందరు అర్హులైన వైద్యులు లేకున్నా పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేస్తున్నారు. మెటర్నటి నర్సింగ్ హోంలలో ప్రసవాలకు తప్పనిసరి అయితేనే శస్త్రచికిత్సలు చేయాలనే నిబంధన ఉన్నా గాలికి వదిలేశారు. జిల్లాలో ఇప్పటికీ కొన్ని దవాఖానాలు పూర్తి స్థాయి అనుమతులు లేకున్నా కొనసాగుతున్నాయి. మొక్కుబడి తనిఖీలు కాకుండా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
నిబంధనలు ఇలా..
ప్రతి ఆసుపత్రిలో బోర్డుపై రిజిస్ట్రేషన్ సంఖ్య, వైద్యుల పేర్లు, వారి వివరాలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. ఫీజుల వివరాలు కూడా తెలియజేయాలి. చీటీపై మందుల వివరాలు చదివే విధంగా రాయాలి. అవసరమైతేనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులను డ్యూటీ డాక్టర్గా నియమించాలి. వెలుతురు, గాలి వచ్చే విధంగా కిటికీలు, వెంటిలేటర్లు ఉండాలి. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల వైద్యులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే సేవలు మొదలుపెట్టాలి. ఆసుపత్రి నిర్వాహకుల వివరాలు కూడా తెలియజేయాలి.
నోటీసులు జారీ చేశాం..
జిల్లాలో కొన్ని ఆసుపత్రులకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చే దస్త్రం కలెక్టర్కు పంపిస్తున్నాం. పూర్తి వివరాలు లేని అయిదు రోగ నిర్ధారణ కేంద్రాలకు నోటీసులు జారీ చేశాం. తనిఖీలు కొనసాగిస్తాం. అధిక శస్త్రచికిత్సలు చేసిన 10 దవాఖానాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ సుజాత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే