సామాజిక మాధ్యమాల్లో.. జర జాగ్రత్త!
చేతిలో స్మార్ట్ఫోన్.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు.
హద్దు మీరితే ఊచలు లెక్క పెట్టాల్సిందే
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: చేతిలో స్మార్ట్ఫోన్.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు. మత, రాజకీయ, వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు పెట్టినా పోలీసు కేసులను ఎదుర్కోవాల్సిందే. జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే.
సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సామాజిక మాధ్యమ పోస్టింగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే లీకులను పోస్టు చేస్తే, ఆ తర్వాత లీకులు ఇచ్చిన వారే అది తప్పుడు పోస్టంటూ ఫిర్యాదులు చేసే అవకాశముంది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీల నాయకులు, అభ్యర్థులు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసుకోగా, కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయించేలా వివిధ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఆయా పార్టీల్లో సామాజిక మాధ్యమాలకు సంబంధించి ప్రత్యేక విభాగాలున్నాయి.
అడ్మిన్లదే పూర్తి బాధ్యత
- సామాజిక మాధ్యమ గ్రూపుల్లో, ముఖ్యంగా వాట్సాప్లో అభ్యంతరకర, విద్వేషాలను రెచ్చగొట్టేలా గ్రూఫులోని సభ్యులెవరు పోస్టులు పెట్టినా అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.
- అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని గ్రూపు నుంచి తొలగించడంతో పాటు సదరు పోస్టును సైతం వెంటనే తొలగించాలి.
- గతంలో కేవలం పోస్టు చేసిన వారు మాత్రమే దాన్ని తొలగించే అవకాశముండగా ప్రస్తుతం గ్రూపులోని ఏ సభ్యుడు పెట్టిన పోస్టునయినా అడ్మిన్ తొలగించే వీలుంది.
- గ్రూప్లో కొత్త సభ్యులను చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవడంతో పాటు తప్పుడు పోస్టులు పెట్టిన వారిని తొలగించి పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా అడ్మిన్దే.
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే తప్పుడు పోస్టులపై, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశముంది.
- ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో ప్రత్యర్థులను అవమానపరిచేలా, తమ అభ్యర్థి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టే అవకాశముంది.
- ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, ఫొటోలు మార్చి, వాయిస్ మెసేజ్లు వాస్తవ విరుద్ధంగా పోస్టులు పెట్టినా, వాటిని షేర్ చేసినా, వాటికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవు.
- తమ అనుమతి లేకుండా గ్రూపులో చేర్చుకునే అవకాశం లేకుండా వాట్సాప్లో ప్రత్యేక ఆప్షన్ను చరవాణి వినియోగదారులు ఎంచుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు