తనిఖీలు లేవు.. తవ్వుకునుడే
మట్టి తవ్వకాలు చేపట్టాలంటే దానికి గనులశాఖకు రాయల్టీ చెల్లించి వేబిల్లులు పొందాలి. అంతకు ముందు అది ప్రభుత్వ, ప్రైవేటుదైనా రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. నీటి పారుదలశాఖ అయితే ఆ శాఖ అనుమతి కూడా తప్పనిసరి.
జలాశయంలో మట్టి దందా
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల, న్యూస్టుడే, వేములవాడ గ్రామీణం
మట్టి తవ్వకాలు చేపట్టాలంటే దానికి గనులశాఖకు రాయల్టీ చెల్లించి వేబిల్లులు పొందాలి. అంతకు ముందు అది ప్రభుత్వ, ప్రైవేటుదైనా రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. నీటి పారుదలశాఖ అయితే ఆ శాఖ అనుమతి కూడా తప్పనిసరి. అనుమతిచ్చిన ప్రాంతంలో ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి అనేది గనులశాఖ అధికారులు పక్కాగా పరిశీలించాలి. కానీ ఇక్కడ అవేవీ ఉండవు. అంతా నోటి మాటలతోనే జరుగుతోంది. మధ్యమానేరు జలాశయంలో నీటి మట్టం తగ్గడంతో ముంపు గ్రామాలు తేలాయి. అక్రమార్కుల కన్ను ఆ ప్రాంతంపై పడింది. ఎఫ్టీఎల్ పరిధి దాటి జలాశయంలోకి చొరబడి యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. పక్కా ప్రణాళికతో మట్టి దందాను నడిపిస్తూ రోజుకు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఏ శాఖ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
వేములవాడ గ్రామీణ మండలం అనుపురం, రుద్రవరం శివారులోని మధ్యమానేరు జలాశయంలో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులంతా కూటమిగా మారి ఈ మట్టి దందాను కొనసాగిస్తున్నారు. దాదాపు పదిహేను రోజులుగా యంత్రాలతో వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. ఇందులో మొరం లేఅవుట్లు, ప్రైవేటు నిర్మాణాలకు, నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. లారీ నల్లమట్టి రూ.6 వేలు, ట్రాక్టర్కు రూ.2,500 చొప్పున ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. ఒక ట్రిప్పు మొరం రూ.5 వేలు చొప్పున లారీల్లో తరలిస్తున్నారు. వీటిని సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. జలాశయంలో బయటపడిన ముంపు గ్రామం నుంచి మొరం, నల్లమట్టి తరలిస్తున్న వాహనాలతో అనుపురం, రుద్రవరంలోని దారులు దుమ్ముతో నిండిపోతున్నాయి. మొదట్లో గ్రామస్థులు వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు రోజులు ఆగిన తరవాత యథావిధిగా కొనసాగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. తనిఖీల్లో బయటపడకుండా ఉండేందుకు జలాశయంలో తవ్వకాలను రోజుకు ఒక చోటకు మార్చుతున్నారు.
ఎన్నికల విధుల్లో యంత్రాంగం
జలాశయంలో రెండు నెలలుగా నీటి మట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఆరు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడం, వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. దీనికితోడు అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండటంతో ఇటువైపు కన్నెత్తి చూసేవారు కరవయ్యారు. ఇదే అదనుగా అక్రమార్కులకు మట్టి కాసులు కురిపిస్తోంది.
అధికారులేమంటున్నారంటే...
జలాశయంలో మట్టి తవ్వకాలపై జలాశయం ఈఈ జగన్ను ‘ఈనాడు’ సంప్రదించగా మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. గనులశాఖ ఏడీ క్రాంతి కుమార్ స్పందిస్తూ ఎన్ఓసీ, వేబిల్లులను ఎవరికీ జారీ చేయలేదని పేర్కొన్నారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం ఇటీవలే మా దృష్టికి వచ్చిందన్నారు. ప్రాజెక్టు అధికారులను వెళ్లి పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీసుశాఖ సాయంతో తనిఖీలు చేపడతామని తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి