మామిడి కొనుగోళ్లు ప్రారంభం
బహిరంగ వేలం చేపట్టిన వ్యాపారులు
న్యూస్టుడే- జగిత్యాల ధరూర్క్యాంపు
జగిత్యాల చల్గల్ మామిడిమండీలో కాయల క్రయవిక్రయాలు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు కొనుగోళ్ల మధ్యవర్తిత్వానికిగాను రైతుల నుంచి కమీషన్ తీసుకున్నపుడు కాయలను బహిరంగ వేలం పద్ధతిన కొనుగోలు చేయాలి. కానీ దాదాపు 18 సంవత్సరాల్లో ఒకటిరెండుసార్లు మాత్రమే వేలానికి చర్యలు చేపట్టినా అమల్లోకి రాలేదు. యార్డులో సదుపాయాలు లేవన్న కారణంతో ట్రేడింగ్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. కాగా ఈ సారి యార్డులో షెడ్లు, వాలంతరి నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలం అందుబాటులోకి రావడంతో తప్పనిసరిగా బహిరంగ వేలం పద్ధతిలోనే కాయలను కొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మామిడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఎం.డి.మొయిన్ వేలం పద్ధతిన కాయలను కొనగా బంగినపల్లి రకానికి టన్నుకు రూ.36 వేల నుంచి రూ.55 వేల వరకు ధర పలికింది. మిగిలిన వ్యాపారులు కూడా వేలం పద్ధతిని అనుసరించేలా డీఎంవో ప్రకాశ్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు.
- నాగ్పూర్ మార్కెట్లో ఉదయంపూట కాయలను వేలం వేస్తారు. కానీ చల్గల్ మండీకి రైతులు సాయంత్రం నుంచి రాత్రివరకు కాయలను తెస్తారు కాబట్టి రాత్రిపూట వేలాన్ని కొనసాగించేలా చూడాలి.
- ఈ సీజన్లో పూత బాగావచ్చినా ప్రతికూల వాతావరణంతో కాయల దిగుబడి భారీగా తగ్గినట్లు రైతులు, తోటల గుత్తేదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిలకడైన ధరకు, రైతుల అవగాహనకు నాగ్పూర్, విజయవాడ, హైదరాబాద్, దిల్లీ తదితర మార్కెట్ల ధరలను చల్గల్మండీలో ప్రతిరోజూ ప్రదర్శించాలి.
- యార్డువెలుపల కాయల క్రయవిక్రయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దు. కాయల గ్రేడింగ్, ప్యాకింగ్, లోడింగ్ పనులకు తరలివచ్చే వేలాది కార్మికులకు వసతులు కల్పించాల్సిఉంది. చల్గల్లోని రైపెనింగ్ ఛాంబర్ను అందుబాటులోకి తేవాలి.
- ప్రభుత్వం ప్రకటించినట్లుగా జగిత్యాల బ్రాండ్ పేరిట కాయలను ఎగుమతి చేయాలి. మహిళా సంఘాలు, అపెడ, ఉద్యానశాఖల ద్వారా మామిడి కొనుగోళ్లను చేపట్టాలి. గతంలో మాదిరిగా జగిత్యాల నుంచి ఈ సీజన్లోనూ కిసాన్రైలు ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు కాయలను ఎగుమతి చేయాలి.
- యార్డులోని ధర్మకాంటాలను రైతులకు అందుబాటులోకి తెచ్చి తూకంపక్కాగా జరిగేలా చూడాలి. ప్రతి కొనుగోలుపైనా మార్కెట్ఫీజును వసూలు చేయాలి. తరుగు, చిన్నకాయల పేరిట కోతలు విధించకుండా, సకాలంలో డబ్బులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- చల్గల్తో పాటుగా మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్ తదితర ప్రాంతాల్లోనూ కొందరు లైసెన్స్లేని వ్యాపారులు నేరుగా రైతులనుంచి మామిడిని కొంటుండగా వీరికి లైసెన్స్లు జారీచేసి యార్డులద్వారానే కొనుగోళ్లు జరిపేలా తక్పట్టీలు జారీచేసి క్రయవిక్రయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి.
- సీజన్ ఆరంభంలో ధరలు బాగుంటున్నా స్థానికుల గుత్తాధిపత్యంతో ధరలు తగ్గించటం రివాజుగా ఉంటుండగా దిల్లీ, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు చెందిన లైసెన్స్డ్ వ్యాపారులకూ కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తే పోటీపెరిగి ధరల్లో స్థిరత్వముండి రైతులకు లాభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్