ఆలస్యం.. ఆ అభ్యర్థులకు ఉపశమనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు ఊరట లభించనుంది. లోక్సభ ఎన్నికల కారణంగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈలోగా ముగిసిపోనుంది.
జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అవకాశం
అప్పటికి అనర్హత గడువు పూర్తి కానుండటంతో ఆశావహులకు ఊరట
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు ఊరట లభించనుంది. లోక్సభ ఎన్నికల కారణంగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈలోగా ముగిసిపోనుంది. వీరికి పోటీ చేసే అవకాశం రానుంది. పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. జూన్ 3న ఎంపీటీసీ, జులై 4న జడ్పీటీసీల పదవీ ముగియనుంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో అనర్హత వేటు పడిన అభ్యర్థులకు ఆంక్షలు తొలగిపోనున్నాయి.
లెక్కలు చూపకుంటే తిప్పలే
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి పైసాకు లెక్క చూపాల్సిందే. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019 జనవరిలో సర్పంచులు, వార్డు సభ్యులు, మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఖర్చుల వివరాలను అధికారులకు నివేదించాలి. ఉమ్మడి జిల్లాలో 1,212 పంచాయతీల్లో సర్పంచులు, 12,045 మంది వార్డు సభ్యులు, 52 మంది జడ్పీటీసీలు, 646 మంది ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఎంపీడీవోలు అభ్యర్థుల ఖర్చులను లెక్కించి నివేదించారు. ఖర్చుల నివేదికపై అవగాహన లేకపోవడం, మరోసారి పోటీ చేయబోమనే భావన, ఇతరత్రా కారణాలతో చాలా మంది లెక్కలు చూపలేదు. దీంతో 2021లో ఉమ్మడి జిల్లాలో 5,055 మంది అభ్యర్థులపై వేటు వేశారు. ఇందులో సర్పంచి స్థానానికి 410, వార్డు సభ్యులకు 4,228, జడ్పీటీసీ 30, ఎంపీటీసీ స్థానంలో పోటీ చేసిన 387 మంది అనర్హులుగా ప్రకటించారు.
ఆంక్షలు తొలిగె.. ఆశలు చిగురించే
ఎన్నికల్లో అనర్హత వేటు పడ్డ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే ఆశలు చిగురిస్తున్నాయి. నోటీసులు జారీ చేసిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయరాదు. సర్పంచి, వార్డు సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మే నెలాఖరు వరకు నిషేధం ఉంది. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యంకాదు. షెడ్యూల్ ప్రకారం సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోయేవారు. జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రకటన అనర్హత వేటు పడిన అభ్యర్థులకు మరోసారి అదృష్టం కలిసిరానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్