అన్ని వివరాలు పూరించాల్సిందే!
సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు కీలకమైన ఈ దశలో ఏ మాత్రం తప్పుదొర్లినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
నామినేషన్ దాఖలులో అప్రమత్తత అవసరం
న్యూస్టుడే, గోదావరిఖని, కరీంనగర్ పట్టణం
సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు కీలకమైన ఈ దశలో ఏ మాత్రం తప్పుదొర్లినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి కాలమ్నూ జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది. నామపత్రంతో పాటు అఫిడవిట్లోనూ పూర్తి వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను పూరించే తీరుపై న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు.
ఒక్కటి వదిలేసినా తిరస్కరణే
అభ్యర్థులు ప్రమాణ పత్రంలోని ప్రతి కాలమ్నూ పూరించాలి. ఒక్కదాన్ని వదిలేసినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. సంబంధం లేని అంశం వద్ద ‘నిల్’ వర్తించదు అని రాయాలి. ప్రమాణ పత్రంలో ఏదైనా సమాచారం లేకపోతే ఎన్నికల అధికారి నోటీసు ఇస్తారు. దాన్ని సవరించి తిరిగి అందజేయాలి. అప్పటికీ తప్పులుంటే పరిశీలన సమయంలో నామినేషన్ను తిరస్కరిస్తారు. అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను నోటీసు బోర్డుతో పాటు వెబ్సైట్లో పొందుపరుస్తారు.
ఆస్తుల వివరాలన్నీ రాయాల్సిందే
అఫిడవిట్లో స్థిర, చరాస్తుల వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. బ్యాంకు ఖాతాల్లో నగదు, డిపాజిట్లు, సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పుల వివరాలు నమోదు చేయాలి. చేతిలో ఉన్న నగదును కూడా పేర్కొనాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వివరాలను ప్రస్తావించడంతో పాటు అవి ఎలా వచ్చాయో కూడా రాయాలి. స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ చూపాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు, వాటి వివరాలు, వారి ఆదాయ మార్గాలు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో కాంట్రాక్టులుంటే వాటి వివరాలు నమోదు చేయాలి.
శిక్షలు.. కేసులు
నేర చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రమాణ పత్రంలో నమోదు చేయాలి. ఏదైనా నేరానికి సంబంధించిన శిక్షలు పడి ఉంటే వివరాలు ప్రస్తావించాలి. అప్పీలుకు వెళ్లినా వివరాలు నమోదు చేయాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలియజేయాలి. నోటరీ తప్పనిసరిగా చేయించాలి. అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటన ఇవ్వాలి.
ఓటర్లకు అవగాహన
ఎన్నికల సమయంలో అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియాలి. కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల పూర్తి సమాచారంతో కూడిన అఫిడవిట్ను వెబ్సైట్లో ఉంచుతుంది. నిబంధనలకు లోబడి ఫారం-26 ద్వారా అభ్యర్థులు తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలి. అందులోనే ఆస్తులు, అప్పులు, కేసులు, ఇతర పూర్తి సమాచారం అందులో ఉండటంతో ఓటర్లు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది.
పారదర్శకంగా పొందుపరచాలి
-ఎం.అనిల్కుమార్, న్యాయవాది, కరీంనగర్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫాం 26 ద్వారా ఎన్నికల నిబంధనలకు లోబడి పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ను సమర్పించాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, కులం వివరాలు ఉండాలి. ముఖ్యంగా ఆస్తులు, అప్పులు, నేర వివరాలను పారదర్శకంగా పొందుపరచాలి. అఫిడవిట్ను నోటరీ చేయించాలి. తప్పులుంటే న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అభ్యర్థుల వివరాలను ప్రజలు తెలుసుకునే అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?