రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
జగతికే ఆదర్శప్రాయుడు శ్రీరాముడ[ు.. కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా.. ఆదర్శ జీవనానికి ప్రమాణంగా చెప్పుకొనే సీతారాములు కల్యాణోత్సవం నిర్వహణకు జిల్లాలో ఆలయాలను ముస్తాబు చేశారు.
కరీంనగర్ సాంస్కృతికం, న్యూస్టుడే: జగతికే ఆదర్శప్రాయుడు శ్రీరాముడ[ు.. కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా.. ఆదర్శ జీవనానికి ప్రమాణంగా చెప్పుకొనే సీతారాములు కల్యాణోత్సవం నిర్వహణకు జిల్లాలో ఆలయాలను ముస్తాబు చేశారు. నగరంలోని సప్తగిరికాలనీ కోదండ రామాలయం, వావిలాలపల్లి, గాంధీరోడ్డు రామాలయాలు, వాసవి కన్యకాపరమేశ్వరీ, రాంనగర్ రమా సత్యనారాయణ, అభయాంజనేయ స్వామి, మహాశక్తి, గిద్దెపెరుమాండ్ల దేవస్థానం, హెలిప్యాడ్ మైదానం పక్కన ప్రసన్నాంజనేయ స్వామి, జడ్పీ క్వార్టర్ విద్యానగర్, మార్కెట్ రోడ్డు, మంకమ్మతోట వేంకటేటేశ్వరాలయాల్లో, పాతబజారు వీరాంజనేయ, యజ్ఞవరాహ స్వామి క్షేత్రం తదితర ఆలయాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, షామియానాలు, ప్రత్యేక వేదికలు, కూలర్లు సమకూర్చుతున్నారు. నీటి వసతితోపాటు అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు. పుష్పమాలలు, మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో ఆలయాలను అలంకరించారు. కొన్ని ఆలయాల్లో మంగళవారం రాత్రి ఉత్సవమూర్తులను అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.
ఎదుర్కోలు ఉత్సవాలు...
కరీంనగర్ సాంస్కృతికం : శ్రీరామ నవమి సందర్భంగా కోదండ రామాలయం సీతారాములు కల్యాణ ఉత్సవమూర్తులకు మంగళవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మంత్రి దంపతులు స్వాగతం పలికి ఇంట్లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎదుర్కోలు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున రాజేందర్, ఆకారపు భాస్కర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, కటకం వెంకటరమణ, అర్చకులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, జమ్మికుంట: ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ సిబ్బంది సమర్పించారు. బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుధాకర్ తెలిపారు. ఇల్లందకుంట, జమ్మికుంట రామాలయాల్లో బుధవారం నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం జమ్మికుంటలో ప్రధానార్చాకులు వెంకటాచారి ఆధ్వర్యంలో అంకురార్పణ హోమం, ధ్వజారోహణం చేశారు. గరుడ హోమం, రాత్రి స్వామివారి ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ జె.ఇంద్రారెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ