ప్రజలు మళ్లీ మోసపోవద్దు
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు.
భాజపా, కాంగ్రెస్లను ఓడించాలి
బహిరంగ సభలో భారాస నేతలు
భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు సంఘీభావం తెలుపుతున్న కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా భారాస అధ్యక్షుడు విద్యాసాగర్రావు
ఈనాడు, నిజామాబాద్: భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో బాజిరెడ్డి ప్రసంగించారు. మనమందరం రాముడిని కొలుస్తామని.. సకల సుగుణాలు ఉన్న పురుషోత్తముడి గురించి భాజపా నాయకులకు తెలియదన్నారు. ఆ మహా పురుషుడి పేరు చెప్పుకొని పాలన సాగించే మోదీ పేదలను విస్మరించారని విమర్శించారు. ఒకే కుటుంబం నుంచి తండ్రి-కొడుకులు ఎంపీలుగా ఉండటం అరుదుగా ఉంటుందని, ఆ అవకాశం దక్కిన అర్వింద్, ఐదేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి.. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇక్కడి ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లుగా ఇటువైపు రాని వ్యక్తి.. ఎంపీగా గెలిపిస్తే వస్తాడనే నమ్మకం లేదన్నారు. అసలు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డితోనే పోయిందని.. ఇప్పుడు పాత కాంగ్రెసోళ్లు రేవంత్కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించానన్నారు. ఎంపీగా అవకాశమిస్తే ప్రజల గొంతును లోక్సభలో వినిపిస్తానన్నారు. మాజీ మంత్రలు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ సురేష్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి మహమూద్ అలీ, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల భారాస అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఆశన్నగారి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా సభలో ప్రసంగించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తప్పుడు కేసులతో భారాస నేతలను ఇబ్బంది పెడుతున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు. చిన్న కేసులో తన కొడుకును చిత్రహింసలకు గురిచేసి.. రాజకీయ కక్ష సాధింపులకు దిగారని అయోషా ఫాతిమా పేర్కొన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్తో ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
గులాబీ శ్రేణుల్లో జోష్..
అధికారం కోల్పోయాక భారాస తొలి బహిరంగ సభను శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించింది. చెప్పిన సమయం కంటే ఆలస్యమైనప్పటికీ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావటంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు ఉద్యమ కాలంలో మాదిరిగా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. అధిష్ఠానం నుంచి పెద్ద నాయకులు ఎవరూ రానప్పటికీ.. ఉన్న నాయకత్వమే పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తూ మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో పార్టీకి పూర్వవైభవం తేవడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చిన సందర్భంలో కార్యకర్తలు సానుకూల నినాదాలతో హోరెత్తించారు. గ్రామగ్రామన ప్రచారం ఉద్ధృతం చేసి నిజామాబాద్ స్థానాన్ని గెలుపించుకుందామని నాయకులు కోరారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రెండు జిల్లాల జడ్పీ ఛైర్మన్లు విఠల్రావు, వసంత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సభ్యులు జగన్, సుమన, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం