పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది.
న్యూస్టుడే, జ్యోతినగర్(మార్కండేయకాలనీ): బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. రోజురోజుకీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, ఆభరణాలు చేసే స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 26వ తేదీ వరకే శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల కారణంగా శుభకార్యాలు నిర్వహించే వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నూతన వధూవరుల కోసం బంగారు ఆభరాణాలు తయారు చేయించే విషయంలో తమ ఆర్థిక అంచనాలు తలకిందులవుతున్నాయని పలువురు వాపోతున్నారు.
కొనాలంటే.. భయపడుతున్నారు
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారి ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సంబంధం కుదిరితే బంగారం కొనుగోలు విషయంలో భయపడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా పుస్తె, మెట్టెలు కొనాలన్నా సుమారు రూ.40 వేలు అవుతుంది. ఆభరణాలు చేయించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సిందే. కొంత మంది ధర తగ్గితే బంగారం కొనుగోలు చేద్దామని నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకీ ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. భవిష్యత్తులో బంగారం కొనగలమా అనే సందేహం కొనుగోలు దారులు, స్వర్ణకారుల్లో నెలకొంటోంది.
కజాంపురం రాకేష్, బంగారం వ్యాపారి
రానున్న రోజుల్లో ఇబ్బందులు
పసిడి ధరల్లో అనూహ్య పెరుగుదల వల్ల కొనుగోలుదారులతో పాటు స్వర్ణకారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.62 వేలు ఉంటే ప్రస్తుతం రూ.76 వేల పైచిలుకు చేరింది. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్లో రోజుకు ఐదు తులాల విక్రయాలు చేశాం. ఈసారి రోజుకు తులం కూడా విక్రయించడం గగనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. ధరలు ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు.
గుగ్గిళ్ల రవీంద్రచారి, జ్యువెల్లర్స్ బులియన్ మర్చంట్, రామగుండం అధ్యక్షుడు
అంతర్జాతీయ పరిణామాలతో..
అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా పుత్తడి ధరలు పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందనంత దూరం వెళ్తోంది. చాలామంది శుభ కార్యాలకు బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో తక్కువ పరిమాణంలో ఆభరణాలు కొంటున్నారు. సీజన్లో ఈ ప్రాంతం మార్కెట్లో గతేడాది నిత్యం 20 కిలోల బంగారం అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 10-12 కిలోలు కూడా విక్రయించడం లేదు. కొనుగోలు, అమ్మకందారులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
శ్రీనివాస్, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం