అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
లోక్సభ స్థానం పరిధిలో 2 అంతర్రాష్ట్ర, జిల్లాల సరిహద్దులో 15 చెక్పోస్టులు
సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్పోస్టులో తనిఖీ చేస్తున్న అధికారులు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారా? లేదా పరిశీలించేందుకు కలెక్టరేట్లో మానిటరింగ్ వ్యవస్థకు సీసీ కెమెరాలు అనుసంధానించారు. రిటర్నింగ్ అధికారులు తమ చరవాణుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలను పరిశీలిస్తున్నారు. నామినేషన్లు స్వీకరిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
తనిఖీ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే..
లోక్సభ పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అర్జునగుట్టలో అంతర్రాష్ట్ర, చెన్నూర్లో అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీ, బెల్లంపల్లిలో రేపల్లివాడ, సోమగూడెం, పోచమ్మ గుడి, మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం, తాళ్లపేట, ఇందారం, ధర్మపురి నియోజకవర్గంలో రాయపట్నం గోదావరి వంతెన, మంథని నియోజకవర్గంలో వెక్లాస్పూర్, మేడిపల్లి, పెద్దపల్లిలో గుంపుల వంతెన, దుబ్బపల్లి, రామగుండం నియోజకవర్గంలో గోదావరి వంతెన, బసంత్నగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతాల్లో జిల్లా సరిహద్దు తనిఖీ కేంద్రాలు నెలకొల్పారు. పోలీసులు, ఆబ్కారీ, ఇతర శాఖల సిబ్బంది వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం, డబ్బు పంపకాలు, తాయిలాలు నియంత్రించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందుబాటులోని సాంకేతికత అందిపుచ్చుకుని నిఘా పెంచుతున్నారు. పోలీసుల పహారాలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులోని చెక్పోస్టుల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో చెక్పోస్టుల వద్ద వీడియో చిత్రీకరణలో వాహనాల తనిఖీలు చేసేది. అప్పుడప్పుడు జిల్లా ఉన్నతాధికారులు వీడియో చిత్రీకరణ దృశ్యాలను తనిఖీ చేసేవారు. ప్రస్తుతం వాహనాల తనిఖీల్లో పారదర్శకత కోసం మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారు. చెక్ పోస్టుల్లోని ఇరువైపులా బిగించిన సీసీ కెమెరాలు మానిటరింగ్ వ్యవస్థకు అనుసంధానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగుకు బాసట.. స్వావలంబన బాట
[ 26-07-2024]
సాగుకు ప్రాధాన్యం ఇస్తూ.. సంక్షేమంపై దృష్టి పెడుతూ సాగిన రాష్ట్ర పద్దులో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు.. -
పాఠశాలల్లో చరవాణుల వినియోగానికి తెరపడేనా..!
[ 26-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనివేళల్లో చరవాణులు వాడుతూ బోధన చేయడం లేదని పలువురు జిల్లా ఉన్నతాధికారులు వారి సందర్శన సమయంలో గుర్తించారు. -
ఊతమిస్తే కదా.. పతకాల ఊసు
[ 26-07-2024]
రెండు వందలకుపైగా దేశాలు 11వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందులో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధిస్తారో త్వరలోనే తేలనుంది. -
వంతు వచ్చేవరకు..ఉగ్గబట్టుకోవాల్సిందే..!
[ 26-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. నిధుల కొరతతో చాలా పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 26-07-2024]
చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
[ 26-07-2024]
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
ముసుగేసిన వ్యాపారాలు
[ 26-07-2024]
ఆషాఢానికి తోడు నాలుగు రోజులుగా పడుతున్న వర్షం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. -
జనన ధ్రువపత్రాలకు అగచాట్లు
[ 26-07-2024]
పురపాలక కార్యాలయంలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ నెల రోజులుగా నిలిచిపోవడంతో దరఖాస్తులు పేరుకుపోయాయి. -
ఎంపిక సరే.. ప్రోత్సాహకమేదీ?
[ 26-07-2024]
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోపాటు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్