ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. మొత్తం ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాల్లోకి వెళ్లాయి. రెండు సెగ్మెంట్లు రెండేసి జిల్లాల్లో ఉండగా, మిగతా రెండు ఒకే జిల్లా పరిధిలో ఉన్నాయి. గతంలో పార్టీలపరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం అయిదుగురు ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు వారందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
హామీలు అమలయ్యేనా!: ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా హుస్నాబాద్, బెజ్జంకి మండలాలను కరీంనగర్ జిల్లా పరిధిలోకి తేవాలన్న అంశం శాసనసభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. ఈ మేరకు శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి.
శాసనసభ నియోజకవర్గాల వారీగా ఇలా..
సిరిసిల్ల(1): నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్ల్లాలోనే ఉన్నాయి.
వేములవాడ(2): కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాలు జగిత్యాల జిల్లాలోకి వెళ్లగా, వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలు రాజన్న సిరిసిల్లలో ఉన్నాయి.
చొప్పదండి(3): చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల, బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉన్నాయి.
కరీంనగర్(1): కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్ మండలాలుండగా పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో ఉంది.
హుజూరాబాద్(2): కమలాపూర్ హన్మకొండ జిల్లాలో ఉండగా హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలు కరీంనగర్ పరిధిలోకి వస్తాయి.
మానకొండూర్(3): మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బెజ్జంకి సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి.
హుస్నాబాద్(3): హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో ఉన్నాయి.
నాడు జాబితాలో పేరుండటమే ఓటరు గుర్తింపు
న్యూస్టుడే, ధర్మారం: దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మొదటి ఎన్నికల నిర్వహణకు అయిదేళ్లు ఆగాల్సి వచ్చింది. అప్పట్లో ఎవరికీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రాగా 1951లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 21 ఏళ్లు నిండిన, సంబంధిత నియోజకవర్గంలో ఆరు నెలలు(180 రోజులు)గా నివాసం ఉంటున్న వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించారు. తాము భారతీయులమని చెప్పుకోవడానికి అప్పట్లో ఎవరి వద్దా గుర్తింపు పత్రాలు లేవు. దీంతో ఓటరు జాబితాలో పేరుంటే తాము భారతీయులమైనట్టేనని పోటీ పడి నమోదు చేసుకునేవారు. అప్పటి దేశ జనాభాలో కేవలం 49 శాతం మంది అంటే 17,32,12,343 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!