వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి.
‘దేఖో అప్నా దేశ్ పీపుల్ ఛాయిస్-2024లో భాగస్వాములమవుదాం
ఎలగందుల ఖిల్లా
న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న స్వామి క్షేత్రం.. కొండగట్టు అంజన్న ఆలయం, గోదావరి ఒడ్డున గల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కోటిలింగాల శివాలయం, పెద్దపల్లిలో రామగిరి ఖిల్లా, కరీంనగర్లో ఎలగందుల కోటా తదితర కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏళ్ల తరబడి సరైన వసతులు లేక అభివృద్ధికి నోచుకోవట్లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడి కోటలు, అద్భుత శిలా సంపద మరుగున పడుతున్నాయి. అయితే వాటి పరిరక్షణకు, వసతుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. దీని కోసం https///innovateindia.mygov.in./dekhoapna-desh/ అనే వెబ్సైట్ను తీసుకొచ్చింది. దీనిపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
ఆన్లైన్లోనే...
మరుగున పడ్డ పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొనాలి. సైట్లోకి వెళ్లాక ‘ఓట్ నౌ’ పై క్లిక్ చేసి పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత విభాగాల వారిగా ఓటేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. అక్కడ కల్పించాల్సిన వసతులను గుర్తించాలి. రవాణా, పారిశుద్ధ్యం తదితర వసతులు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు ఎలగందుల కోట ఎంపిక చేస్తే అక్కడ ఎలాంటి వసతులు కావాలో సైట్లో పొందుపర్చవచ్చు. ఇలా ఏదైనా జనాదరణ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఇవీ మన ప్రాంతాలు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు పురాతన కట్టడాల కింద ఎలగందుల, ధూళికట్ట కోటలు.. దేవాదాయ శాఖ పరిధిలో కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, కోటి లింగాల, ఇల్లందకుంట రామాలయం, కొత్తగట్టు మత్య్సగిరీంద్రస్వామి, ధర్మపురి నృసింహాస్వామి ఆలయాలకు, బిజగిరిషరీఫ్ దర్గా, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం, రామగిరి ఖిల్లా, మానేరు జలాశయాలు తదితర ప్రాంతాలకు ఓటు వేయొచ్చు. వైల్డ్లైఫ్ కింద జగిత్యాల జిల్లా రాయికల్, సారంగపూర్ అడవులు లాంటి ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ లేని వసతులను ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఓటేసిన వారు ప్రశంసాపత్రం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయిదు విభాగాల్లో ...
దేశంలో అనేక రకాల పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత మార్చిలో జమ్మూకశ్మీర్లో పర్యటించినప్పుడు ‘దేఖో అప్నా దేశ్ పీపుల్ ఛాయిస్-2024 పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో అయిదు విభాగాలుంటాయి. ఆధ్యాత్మిక, వారసత్వ, ప్రకృతి, అడవులు, సాహసోపేత ప్రాంతాలుగా విభజించారు.
30 వరకు అవకాశం
ఈ నెల 30 వరకే ఓటేసే అవకాశం ఉంది. అనంతరం వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ప్రజల కోరిక మేరకు వసతులు మెరుగుకు చర్యలు తీసుకుంటుంది. వేములవాడ, కొండగట్టుల్లోని ఆలయాల్లో భక్తుల కోసం హరిత హోటళ్లు, గదులు పెంచే అవకాశం ఉంటుంది. ఎలగందుల కోటను మరింతా ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చు.
ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారసత్వ ప్రాంతాలతో పాటు జింకల పార్కు, మానేరు డ్యాం ప్రాంతాల్లో సౌకర్యాల మెరుగుకు ఓటేశా. ఓటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటే మన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
ఘన్శ్యాం ఓజా, సామాజిక కార్యకర్త, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు