ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి.
కరీంనగర్ ఎంసీహెచ్లో ఇబ్బందులు
దాతలు ముందుకొస్తే ఉపశమనం
ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లతో బాలింతలు
న్యూస్టుడే, కరీంనగర్ సంక్షేమ విభాగం: భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. బాలింతలు శిశువులు ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో బాలింత వద్దకు బంధువులు ఇద్దరు, ముగ్గురు వస్తుండడంతో వార్డు మొత్తం ఉక్కపోతతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతోంది. వార్డులలో రెండు పడక మంచాలకు కలిపి ఒక్క ఫ్యాన్ ఉండడంతో అది సరిపోక ఇంటి నుంచి పంకాలు తెచ్చుకుంటున్నారు. నల్గొండ జిల్లా ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏసీలు బిగించారు. మన వద్ద పాలకులు, దాతలు స్పందించి ఏసీలు, కూలర్లు అందిస్తే బాగుంటుందని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.
స్వచ్ఛమైన గాలి లేకపోతే..
కరీంనగర్ మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి ప్రతి రోజు 200కు పైగా గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం ఓపీ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్ల గాలి సరిపోవడం లేదు. ఆసుపత్రి ఫైల్నే విసనకర్రలా వాడుతున్నారు. గర్భిణులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. అందులో స్వచ్ఛమైన గాలి చల్లగా లేకపోతే వారి పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. నాలుగు బాలింతల వార్డులలో ఎప్పుడు 100 మందికిపైగా ఉంటారు. సాధారణ ప్రసవమైన వారు మూడు రోజులకు ఇంటికి వెళ్తుండడంతో వాళ్లకు ఇబ్బంది ఏమి ఉండదు. శస్త్రచికిత్స చేసిన మహిళలు ఏడు రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఉక్కపోతకు వార్డులో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉక్కపోత కారణంగా కుట్లు మానకపోగా, చెమటతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది.
నల్గొండ కావాలి ఆదర్శం
నల్గొండ జిల్లా మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ఎండ వేడికి బాలింతల ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలింతల వార్డులకు 32 ఏసీలను ఏర్పాటు చేయించారు. ఇక్కడి పాలకులు, స్వచ్ఛంద సంస్థలు నాయకులు స్పందిస్తే ఇక్కడ గర్భిణులు, బాలింతలకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆసుపత్రిలోని వార్డులలో నాలుగు ఏసీలతోపాటు పది కూలర్లు అవసరం ఉన్నాయి.
చిన్నారుల అవస్థలు
వార్డుల్లో బాలింతలతోపాటు ముక్కుపచ్చలారని శిశువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు మంచాలకు కలిపి ఒక ఫ్యాన్ ఉండడంతో పలువురు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. విపరీతమైన వేడితో శిశువులు ఇబ్బందిపడుతున్నారు. బాలింతలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని దాతలెవరైనా ముందుకొస్తే ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్