తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకోని అధికారులు
చిరు వ్యాపారికి రూ. 50లకు ఇచ్చిన రసీదు
న్యూస్టుడే, వేములవాడ : పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఏటా మున్సిపల్ అధికారులు వేలం నిర్వహిస్తుంటారు. నిబంధనలకు అనుగుణంగా పాట దక్కించుకున్న గుత్తేదారు చిరు వ్యాపారుల వద్ద తీసుకోవాలి. ఈ నిబంధనలను తుంగలో తొక్కి రోజు వారీగా చిరు వ్యాపారులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేములవాడ మున్సిపల్ పరిధిలో 2023-24 సంవత్సరానికి గాను తైబజార్ను రూ.19.40 లక్షలకు గుత్తేదారు దక్కించుకున్నారు. ఏటా కొందరు సిండికేట్గా మారి తక్కువ ధరకు పాట దక్కించుకొని మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారుల వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రెండింతలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు నోరు మెదపకుండా, చేసేదేమీ లేక గుత్తేదారు అడిగినంత ఇస్తున్నారు. పలు సందర్భాల్లో ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు రైతులు, చిరు వ్యాపారులు గుత్తేదారుతో వాగ్వాదానికి దిగిన సందర్భాలున్నాయి. అయినా ముక్కు పిండి అధికంగా వసూలు చేస్తున్నారు.
ఉత్సవాల సమయంలో రూ.200
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి, శివకల్యాణం, సీతారాములవారి కల్యాణోత్సవాల సందర్భంగా పట్టణంలోని రోడ్లపై ఏర్పాటు చేసుకునే తోపుడు బండ్లు, ఇతర దుకాణారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.200 వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. తైబజార్ వసూలు చేసే ధరల్లో ఆటో వ్యాన్, తోపుడు బండ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్కు మాత్రమే రూ.30 నిర్ణయించారు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అలాంటిది వీరి వద్ద రూ.200 తీసుకుంటున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఒక రోజు ఆటోలో వచ్చి మక్క కంకులు, పుచ్చకాయలు తదితర వాటిని విక్రయించే వారి వద్ద రూ.100 పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. చిన్న చిన్న వ్యాపారుల వద్ద రూ.50 తక్కువ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు తెలిసినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా తైబజార్ అదనపు వసూళ్లపై చర్యలు చేపట్టాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
విచారణ చేసి చర్యలు తీసుకుôటాం
వ్యాపారుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు, ఉత్సవాల సందర్భంగా దుకాణాల వద్ద నుంచి రూ. 200 తీసుకున్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. దుకాణాలు, చిరు వ్యాపారులను విచారించి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు తేలితే తైబజార్ గుత్తేదారుపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
అన్వేష్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం