పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు.
ఓడేడ్ వంతెన నిర్మాణంలో అంతులేని జాప్యం
వంతెన పక్క నుంచి తాత్కాలిక రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాలు
ఈనాడు, పెద్దపల్లి-న్యూస్టుడే, మంథని, ముత్తారం: రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. ఎనిమిదేళ్లయినా అతీగతీ లేకపోగా పనుల్లో నాణ్యత లోపాలు బయటపడుతుండటంతో నిరాశే మిగిలింది.
ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మించతలపెట్టిన వంతెనకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పనులు ప్రారంభించిన రెండేళ్లకు ప్రధాన గుత్తేదారు చేతులెత్తేయగా, ఉప గుత్తేదారుకు చెందిన యంత్రాలు, సామగ్రి వరదలకు కొట్టుకుపోవడంతో ఆయన కూడా వదిలేశారు. దీంతో వారధి పనులు అసంపూర్తిగా మిగిలాయి. మరోవైపు ఓడేడ్ వంతెనకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.21.46 కోట్లతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణాలు కొట్టుకుపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచాయి.
నాణ్యత లోపం లేదు: డీఈఈ
వంతెన గడ్డర్లు వాగులో వేసిన తాత్కాలిక రహదారిపై పడటంతో రెండు జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఓడేడ్ వంతెన నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం లేదని, ప్రకృతి వైపరీత్యం వల్లే గడ్డర్లు కూలిపోయాయని ఆర్అండ్బీ డీఈఈ ఇమానొద్దీన్ జాఫర్ తెలిపారు. రివైజ్డ్ అంచనాలు రూపొందించి తిరిగి టెండర్లు పిలవాల్సి ఉంటుందని, గుత్తేదారుకు బదులుగా ఏజెన్సీకి పని అప్పగిస్తే ఏడాదిలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
విచారణ చేయమని సీఎంను కోరా: మంత్రి
ఓడేడ్ వద్ద వంతెన గడ్డర్లు కూలిన ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు మంత్రి శ్రీధర్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల ఉల్లంఘన, గుత్తేదారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.
రూ.75 లక్షల వరకు నష్టం
మానేరుపై ఓడేడ్-గర్మిళ్లపల్లితో పాటు ఖమ్మంపల్లి-తాడిచెర్ల వంతెనల నిర్మాణం ఒకేసారి చేపట్టారు. ఇక్కడ పనులు ఏళ్ల తరబడి సా..గుతుండగా ఖమ్మంపల్లి వద్ద నిర్మాణం పనులు పూర్తయి, వంతెన మీదుగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఓడేడ్ వద్ద పనులు అసంపూర్తిగా నిలవడంతో రెండు జిల్లాల మధ్య వర్షాకాలంలో రవాణా సౌకర్యాలు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా వంతెనకు చెందిన మూడు గడ్డర్లు కూలిపోవడంతో దాదాపు రూ.75 లక్షల నష్టం వాటిల్లింది. ఎనిమిదేళ్ల కిందట పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 23 పియర్లు, 13 బీములు నిర్మించారు. మరో 11 బీముల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ.22 కోట్ల వరకు పనులు చేయగా గుత్తేదారుకు రూ.18 కోట్ల వరకు చెల్లించారు. గుత్తేదారుకు పొడిగించిన అదనపు గడువు కూడా పూర్తి కావడంతో కాంట్రాక్టు రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం