బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
లోక్సభ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం
జిల్లా కంట్రోల్ రూంలో సిబ్బందితో పర్యవేక్షిస్తున్న జిల్లా నోడల్ అధికారి రవీందర్
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్ : లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండటంతో బరిలో నిలిచే అభ్యర్థుల కదలికలు, ప్రచారాలపై ఓ కన్నేసింది. నిఘా బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తోంది. స్వేచ్ఛాయుత, పారదర్శకత ఎన్నికలకు అమలు చేస్తున్న సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై, ప్రచార అనుమతల కోసం సువిధ యాప్ల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం చేయడంతో స్పందన పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాలు, రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలను గమనిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
నియోజకవర్గాల్లో ఈవీఎంలు భద్రం
లోక్సభ ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎంలను జిల్లాలో మొదటి విడతలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేశారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ప్రతి ఒక యంత్రం పనితీరు, సాంకేతిక సమస్యలను పరిశీలించి సందేహాలను తొలగించారు. ఇక్కడ నుంచి నియోజకవర్గాలకు తరలించారు. రామగుండం నియోజకవర్గంలో 325 బ్యాలెట్ యూనిట్లు, 325 కంట్రోల్ యూనిట్లు, 364 వీవీప్యాట్లు, మంథనిలో 362 బ్యాలెట్, 362 కంట్రోల్ యూనిట్లు, 406 వీవీప్యాట్లు, పెద్దపల్లిలో 362 బ్యాలెట్ యూనిట్లు, 362 కంట్రోల్ యూనిట్లు, 406 వీవీప్యాట్లను ప్రత్యేక గోదాంలో భద్రపరిచారు. నియోజకవర్గ స్థాయిలో రెండోసారి పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.
పెరుగుతున్న సామాజిక స్పృహ
ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఫ్లయిండ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో వ్యూవింగ్, ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు పారదర్శకత ఎన్నికల కోసం ప్రజల్లో సామాజిక స్పృహ పెరుగుతోంది. జిల్లా కంట్రోల్ రూమ్లోని 1950 టోల్ ఫ్రీ నంబర్కు 76, సి-విజిల్ 13, ఎన్జీఎస్పీ (నేషనల్ గ్రీవెన్సెస్ సర్వీసు పోర్టల్) 56 చొప్పున ఫిర్యాదులు రాగా వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తున్నారు. జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్రెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 24 గంటల పాటు విడతల వారీగా సిబ్బంది విధుల్లో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.