ఆయుధాలు అప్పగించారు..
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు.
ఠాణాలకు చేరిన లైసెన్సుడ్ తుపాకీలు
న్యూస్టుడే, గోదావరిఖని : వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయుధాలను అప్పగించాలని పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు వంద శాతం డిపాజిట్ చేశారు. ఆయధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం వ్యక్తిగత తుపాకీ లైసెన్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని ఠాణాల్లో ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో ఈ నిబంధన అమలులో ఉంది.
నిబంధనలు వర్తిస్తాయి
ఉమ్మడి జిల్లాలో మొత్తం 263 లైసెన్సుడ్ ఆయుధాలున్నాయి. ఇందులో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న 201 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు ఠాణాల్లో అప్పగించారు. మిగతా 62 ఆయుధాలను వివిధ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల భద్రత కోసం వినియోగిస్తున్నారు. అప్పగించిన ఆయుధాలను లైసెన్సుదారులు జూన్ 7న తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
- ఎన్నికల నోటిఫికేషన్ నాటికే లైసెన్సు కలిగిన ఆయుధాలను అప్పగించాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆలోపే పోలీసు శాఖ నుంచి వెళ్లిన సమాచారం మేరకు లైసెన్సుదారులు తమ పరిధిలోని ఠాణాలకు అప్పగించారు.
- వ్యక్తిగత భద్రత కోసం ఎవరైనా ఆయుధాలు పొందే అవకాశం ఉంది. 1959 చట్టం ప్రకారం తుపాకీ లైసెన్సు కావాలనుకునే వారు ముందుగా జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. అతడికి ప్రాణ హాని ఉందా? అన్న విషయాన్ని ఆ ప్రాంత ఠాణా పరిధి పోలీసులు పరిశీలిస్తారు. ఆ వివరాలను సీఐ, డీఎస్పీ, ఎస్పీలకు నివేదిస్తారు. ఈ మేరకు కలెక్టర్ లైసెన్సు మంజూరు చేస్తారు.
- సాధారణంగా రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు, గుత్తేదారులు ఎక్కువగా ఆయుధ లైసెన్సులు తీసుకుంటారు. కేవలం ఆత్మరక్షణ కోసమే వీటిని వినియోగించాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఇతరులను బెదిరించడానికి ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- లైసెన్సు పొందిన వ్యక్తులు నాన్ ప్రొహిబిటెడ్ బోర్(ఎన్పీబీ) తుపాకులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎన్నికల సమయంలో తప్పకుండా ఠాణాల్లో అప్పగించాలి.
శాంతిభద్రతలకు భంగం వాటిల్లకూడదనే..
ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది. శాంతిభద్రతలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ మేరకు ఆదేశిస్తాం. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే భద్రతా సిబ్బంది, గార్డు విధులు నిర్వహించే వారికి మినహాయింపు ఉంటుంది.
-ఎం.శ్రీనివాస్, రామగుండం సీపీ‘
ఒక జిల్లా.. ముగ్గురు ఎంపీలు
జగిత్యాల జిల్లా మూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. మొత్తం 20 మండలాలు, 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో, చొప్పదండి సెగ్మెంట్లోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఇక ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఉంది. -
న్యూస్టుడే, రాయికల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత