ఇంటర్లో బాలికలదే పైచేయి
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలో జిల్లాకు 21వ స్థానం
వందశాతం ఉత్తీర్ణత నమోదైన సారంగాపూర్ కేజీబీవీలో విద్యార్థులను అభినందిస్తున్న అధ్యాపక బృందం
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం: ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 5,741 మంది విద్యార్థులకుగాను 3,691 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్లో 1,045 మంది పరీక్షలు రాయగా 584 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ సంవత్సరంలో 25వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 21 స్థానం సాధించింది.
సత్తా చాటుకున్న బాలికలు
ఇంటర్ వార్షిక పరీక్షల్లో మూడేళ్ల్లుగా విద్యార్థినులదే పైచేయిగా నిలుస్తోంది. గత ఏడాది ప్రథమ సంవత్సర జనరల్ విభాగంలో బాలురు 36 శాతం ఉత్తీర్ణులైతే బాలికలు 63.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర జనరల్ విభాగంలో బాలురు 51.16 ఉత్తీర్ణులు కాగా బాలికలు 73.49, ద్వితీయ వొకేషనల్ విభాగంలో బాలురు 57.58 ఉత్తీర్ణత సాధించగా బాలికలు 68.18 ఉత్తీర్ణులయ్యారు.
తగ్గిన ఉత్తీర్ణత శాతం
గత వార్షిక పరీక్షలతో పోలిస్తే ఈసారి ఇంటర్లో ఉత్తీర్ణత తగ్గింది. 2023 ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది ప్రథమ సంవత్సరంలో జగిత్యాల జిల్లా 13వ స్థానం సాధించగా ఈసారి 25వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో గతేడాది 10వ స్థానం దక్కగా.. ఈసారి 21వ స్థానంలో నిలిచింది.
సౌకర్యాల కొరతే సమస్య
జిల్లాలో మూడేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు కొంత మేరకు తగ్గడానికి సౌకర్యాల కొరతే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధ్యాపకులున్నా గదుల కొరతతోపాటు ప్రయోగశాలల్లో సదుపాయాలు తగ్గిపోయాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యాచరణ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయాభావంతో భోజనం తీసుకురాలేక ఆకలితోనే పాఠాలు వినాల్సి రావడంతో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నారు. పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పిస్తే ఫలితాలు మరింత ఆశాజనకంగా వచ్చేవని అధ్యాపకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!