పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు.
జిల్లాలో 84,710 మందికే విద్యుత్తు జీరో బిల్లులు
న్యూస్టుడే, సిరిసిల్ల కలెక్టరేట్: వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. ప్రతి నెలా 15 లోపు సెస్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేసి జీరో బిల్లులతో పాటు ఇతర బిల్లులను జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి నెల బిల్లులను సెస్ అధికారులు జారీ చేశారు. సెస్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ప్రజాపాలనలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు 89,749 మంది ఉన్నారు. జీరో బిల్లుల జారీ పూర్తయిన రోజు నాటికి 87,703 మంది అర్హులుగా గుర్తించారు. వీరందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీరో బిల్లులు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో తప్పుల నమోదు కారణంగా కొందరికి జీరో బిల్లులు రాలేదు. దీంతో మున్సిపల్, మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకోవడంతో వాటిని సరి చేశారు. దీంతో మార్చిలో మరో 1,949 మంది అర్హులుగా తేలారు. దీంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. వీరందరికీ ఫిబ్రవరితో పాటు మార్చి నెల జీరో బిల్లులను అందజేశారు.
వేసవి ఎండల ప్రభావంతో...
గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించిన వినియోగదారులను మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు. ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో విద్యుత్తు వినియోగం పెరిగింది. దీంతో చాలా మంది వినియోగదారులు మార్చి నెలలో గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారారు. మార్చి నెలలో మొత్తం 89,652 మంది గృహజ్యోతికి అర్హత సాధించగా, వారిలో 84,710 మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. మిగతా 4,942 మంది అర్హతను కోల్పోయారు. ఎండ తీవ్రతతో విద్యుత్ వినియోగం పెరగడంతో వీరంతా 200 యూనిట్లకు పైగా విద్యుత్తు వాడారు. దీంతో వీరు మార్చి నెల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ఎప్పుడైతే వీరు 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగిస్తారో అప్పుడు మళ్లీ గృహజ్యోతికి అర్హులుగా గుర్తిస్తారు. మార్చిలో గృహజ్యోతికి సబ్సిడీ రూ.3,09,83,820లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో రూ.2,90,77,737 చెల్లించగా, మార్చిలో రూ.19,06,820 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగితే లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆన్లైన్ బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు
సెస్ పరిధిలో జరగాల్సిన విద్యుత్తు వినియోగదారుల బిల్లింగ్ను ఈఆర్సీ ఉత్తర్వుల మేరకు మార్చి నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ బిల్లింగ్ సిస్టం ద్వారా నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్పీడీసీఎల్ పరిధిలో సెస్ సంస్థలో నిర్వహిస్తున్న బిల్లింగ్ను ఎక్కడ నుంచైనా చూడవచ్చు. గతంలో సెస్ పరిధిలో బిల్లింగ్ నిర్వహించడంతో ఆన్లైన్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తే అవి ఇక్కడి సర్వర్లో బిల్లులు చెల్లించినట్లు చూపించి మైనస్ అయ్యేవి. ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ విధానం లేకపోవడంతో కొందరు వినియోగదారులు తెలియక ఆన్లైన్లో చెల్లించాలనే ఉద్దేశంతో వారి బిల్లు రసీదులోని యూఎన్వో నంబర్ను నమోదు చేయడంతో ఎన్పీడీసీఎల్లో బిల్లులు చూపించాయి. వాటిని వినియోగదారులు చెల్లించడంతో అవి ఎన్పీడీసీఎల్ ఖాతాలో జమ అవుతున్నాయి. సెస్ పరిధిలో ఆన్లైన్ లాగిన్లో బిల్లు చెల్లించినట్లు చూపకపోవడంతో మార్చి నెల బిల్లులో గత నెల చెల్లించలేనట్లు చూపి బిల్లులను జరిమానాతో అందజేశారు. అయితే ఆన్లైన్లో బిల్లులు చెల్లించిన వినియోగదారుల వివరాలను ఎన్పీడీసీఎల్ అధికారులు సెస్ కార్యాలయానికి పంపిస్తున్నారని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సెస్ అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల్లో ఏర్పాటు
సెస్ వినియోగదారులు గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఆన్లైన్లో బిల్లులు చెల్లించడానికి వారం రోజుల్లో ఏర్పాట్లు చేస్తాం. గతంలో ఆన్లైన్లో కొందరు వినియోగదారులు తెలియక చెల్లించిన బిల్లులను ఎన్పీడీసీఎల్ నుంచి తిరిగి రప్పించి వాటిని సరిచేస్తాం. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.
సూర్యచంద్రరావు, సెస్ ఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ