పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు.
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు తాము ఏమాత్రం తీసిబోమని నిరూపించారు.
సుదూర ప్రాంతం నుంచి..
చొప్పదండి : ముత్తారం మండలం గద్దపాకకు చెందిన సోమిడి అంజలి చొప్పదండిలోని బాలికల గురుకుల కళాశాలలో చదివి 959 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ప్రభాకర్, సవిత వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు కష్టపడతానని ఆమె పేర్కొంది.
తల్లిదండ్రులు గర్వపడేలా...
మానకొండూర్, న్యూస్టుడే: మానకొండూర్ మండలం దేవంపల్లి గురుకుల విద్యాలయ ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి గణేష్ ఎంపీసీలో 976 మార్కులు సాధించి సత్తాచాటాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెôదిన మణేమ్మ-గంగాధర్ కూలీ దంపతుల కుమారుడైన గణేష్ సాఫ్ట్వేర్ ఇంజినీరై తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తానన్నారు.
కళాశాల టాపర్
శంకరపట్నం : హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన తాటికొండ కవిత-నాగరాజు దంపతుల కూతురు అక్షయ కేజీబీవీలో చదువుతూ బైపీసీలో 963 మార్కులు సాధించింది. ఆ కళాశాలలో టాపర్గా నిలిచింది. ఉపాధ్యాయులు సహకరించారని పేర్కొంది. ప్రస్తుతం ఎంసెట్ శిక్షణ తీసుకొంటుంది.
కేజీబీవీ విద్యార్థి ప్రతిభ
జమ్మికుంట: మండలంలోని సైదాబాద్కు చెందిన కె.సాయిచందన జమ్మికుంట కేజీబీవీలో ఎంపీసీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ 957 మార్కులు సాధించి విద్యాలయంలో మొదటి ర్యాంకు పొందింది. సాయిచందన తండ్రి గోపాల్ ఎకర భూమిలో పత్తి సాగు చేస్తూ.. తల్లి రమ కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు.
తతల్లే చదివించింది
వీణవంక: వీణవంక మండలం కొండపాకకు చెందిన ఈదునూరి అభినయ్ గన్ముకుల ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ చదివి 970 మార్కులు సాధించాడు. తండ్రి మధునయ్య చనిపోగా.. తల్లి కవిత కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. అభినయ్ను ప్రిన్సిపల్ వేణుగోపాల్రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
చేనేత బిడ్డ.. మార్కుల్లో దిట్ట
గంగాధర : గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అంబటి రమేష్ చేనేత కార్మికుడిగా, జ్యోతి బీడీ కార్మికురాలిగా పనులు చేస్తూ కొడుకు శ్రావణ్ను న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో చదివించారు. ఎంపీసీలో 970 మార్కులతో ప్రతిభ చాటాడు. ఈయన పదో తరగతి వరకు గన్నేరువరంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివాడు.
ఇంజినీర్ అవుతా..
చొప్పదండి : చొప్పదండికి చెందిన నేతన్న సందుపట్ల రాజు, లావణ్య కూతురు వన్య స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివి 961 మార్కులు సాధించింది. ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులు సాధించింది. భవిష్యత్తులో ఇంజినీర్ కావడమే లక్ష్యమని పేర్కొంది.
డాక్టర్ కావడమే లక్ష్యం..
శంకరపట్నం : కొత్తగూడెంకు చెందిన కారం రాజేశ్వరీ-రమేశ్కుమార్ల కుమార్తె స్రవంతి స్థానిక కేజీబీవీలో బైపీసీ రెండో ఏడాది చదువుతూ 961 మార్కులు సాధించింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివింది. భవిష్యత్తులో ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ సాధిస్తా
మానకొండూర్ : దేవంపల్లి గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో శామ్యూల్ 959 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. శామ్యూల్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కూలీ దంపతులు బొమ్మ లక్ష్మి-భూమరాజంల కుమారుడు. సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడమే తన లక్ష్యమని తెలిపాడు.
అమ్మానాన్నల కష్టం చూసి..
జమ్మికుంట : హనుమకొండ జిల్లాకు చెందిన మొగిలి-రాధ దంపతులు ఇల్లందకుంట మండలం బుజూనూరుకు వచ్చి స్థిరపడ్డారు. మొగిలి కూలీ పని, రాధ గాజుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు శరత్ జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 943 మార్కులు పొంది కళాశాలలో మొదటి ర్యాంకు సాధించాడు.
డాక్టర్గా సేవలందిస్తా..
హుజూరాబాద్ పట్టణం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీపీసీ రెండో సంవత్సరంలో కుసుంబ కృష్ణకౌశిక్ 937మార్కులు పొందాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం పరిధి జుజునూర్పల్లికి చెందిన వ్యవసాయ కూలీ దంపతులు మోహన్రావు-పద్మల కుమారుడు కృష్ణకౌశిక్. డాక్టర్ చదివి నిరుపేదలకు సేవలందిస్తానని వెల్లడించారు.
ఐఏఎస్ టార్గెట్
గంగాధర : తల్లిదండ్రులు గంగాధర్, రేణుక వ్యవసాయ కూలీలు.. పేదరికం వెంటాడినా చదువుకోవాలనే పట్టుదలతో గంగాధరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొండాయపల్లికి చెందిన కట్కం రుషికేష్ చదివి ఎంపీసీలో 935 మార్కులు సాధించాడు. భవిష్యత్తులో ఐఏఎస్ సాధిస్తానని రుషికేష్ ధీమా వ్యక్తం చేశాడు.
ఉన్నత స్థాయికి ఎదుగుతాల్లే చదివించింది
వీణవంక: వీణవంక మండలం కొండపాకకు చెందిన ఈదునూరి అభినయ్ గన్ముకుల ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ చదివి 970 మార్కులు సాధించాడు. తండ్రి మధునయ్య చనిపోగా.. తల్లి కవిత కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. అభినయ్ను ప్రిన్సిపల్ వేణుగోపాల్రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
చేనేత బిడ్డ.. మార్కుల్లో దిట్ట
గంగాధర : గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అంబటి రమేష్ చేనేత కార్మికుడిగా, జ్యోతి బీడీ కార్మికురాలిగా పనులు చేస్తూ కొడుకు శ్రావణ్ను న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో చదివించారు. ఎంపీసీలో 970 మార్కులతో ప్రతిభ చాటాడు. ఈయన పదో తరగతి వరకు గన్నేరువరంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివాడు.
ఇంజినీర్ అవుతా..
చొప్పదండి : చొప్పదండికి చెందిన నేతన్న సందుపట్ల రాజు, లావణ్య కూతురు వన్య స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివి 961 మార్కులు సాధించింది. ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులు సాధించింది. భవిష్యత్తులో ఇంజినీర్ కావడమే లక్ష్యమని పేర్కొంది.
డాక్టర్ కావడమే లక్ష్యం..
శంకరపట్నం : కొత్తగూడెంకు చెందిన కారం రాజేశ్వరీ-రమేశ్కుమార్ల కుమార్తె స్రవంతి స్థానిక కేజీబీవీలో బైపీసీ రెండో ఏడాది చదువుతూ 961 మార్కులు సాధించింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివింది. భవిష్యత్తులో ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ సాధిస్తా
మానకొండూర్ : దేవంపల్లి గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో శామ్యూల్ 959 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. శామ్యూల్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కూలీ దంపతులు బొమ్మ లక్ష్మి-భూమరాజంల కుమారుడు. సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడమే తన లక్ష్యమని తెలిపాడు.
అమ్మానాన్నల కష్టం చూసి..
జమ్మికుంట : హనుమకొండ జిల్లాకు చెందిన మొగిలి-రాధ దంపతులు ఇల్లందకుంట మండలం బుజూనూరుకు వచ్చి స్థిరపడ్డారు. మొగిలి కూలీ పని, రాధ గాజుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు శరత్ జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 943 మార్కులు పొంది కళాశాలలో మొదటి ర్యాంకు సాధించాడు.
డాక్టర్గా సేవలందిస్తా..
హుజూరాబాద్ పట్టణం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీపీసీ రెండో సంవత్సరంలో కుసుంబ కృష్ణకౌశిక్ 937మార్కులు పొందాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం పరిధి జుజునూర్పల్లికి చెందిన వ్యవసాయ కూలీ దంపతులు మోహన్రావు-పద్మల కుమారుడు కృష్ణకౌశిక్. డాక్టర్ చదివి నిరుపేదలకు సేవలందిస్తానని వెల్లడించారు.
ఐఏఎస్ టార్గెట్
గంగాధర : తల్లిదండ్రులు గంగాధర్, రేణుక వ్యవసాయ కూలీలు.. పేదరికం వెంటాడినా చదువుకోవాలనే పట్టుదలతో గంగాధరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొండాయపల్లికి చెందిన కట్కం రుషికేష్ చదివి ఎంపీసీలో 935 మార్కులు సాధించాడు. భవిష్యత్తులో ఐఏఎస్ సాధిస్తానని రుషికేష్ ధీమా వ్యక్తం చేశాడు.
ఉన్నత స్థాయికి ఎదుగుతా
హుజూరాబాద్ పట్టణం Ë: హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో అపరాధ అనుష్క 931 మార్కులను సాధించింది. హుజూరాబాద్ మున్సిపల్ పరిధి దమ్మక్కపేటకు చెందిన రవీందర్-తిరుమలల కుమార్తె అనుష్క.. వీరు వ్యవసాయం చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయి ఉన్నతస్థాయికి ఎదగాలని ఉందని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?