ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు.
రాష్ట్రంలో జిల్లా స్థానాలివి
ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు
న్యూస్టుడే-కరీంనగర్ విద్యావిభాగం: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో దీటుగా మార్కులు సాధించారు.
ప్రభుత్వ కళాశాలల హవా..
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 950కిపైగా మార్కులు సాధించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎం.రిషిత పటేల్ ఎంపీసీలో 983, యు.సాయిప్రియ ఎంపీసీలో 977, బైపీసీలో సానఅంజుమ్ 968, సీఈసీలో మిష మహ్విన్ 965 మార్కులు పొందారు. ప్రభుత్వ సైన్స్ కళాశాల విద్యార్థి సాయితేజ బైపీసీలో 965, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి జిషన్ బిన్ బక్రన్ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆదర్శ పాఠశాలల్లోనూ ఉత్తమ మార్కులు వచ్చాయి. గంగాధర ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆర్.వర్షిణి ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు కైవసం చేసుకుంది.
నేటి నుంచి రీకౌంటింగ్
అందరి కృషితో ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈసారి కళాశాలలకు సెలవులు తక్కువగా రావడంతో విద్యార్థులు కష్టపడి చదివారు. అన్ని కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల కృషితో గతేడాది ఫలితాల కంటే ఈసారి మెరుగైన స్థానం సాధించాం. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవాలనే ఆసక్తి గల వారు గురువారం నుంచి వచ్చే నెల 2వ తేదీలోపు రుసుంలు చెల్లించాలి.
జగన్మోహన్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి
భళా బాలికలు..
- ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 63.41 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. గతేడాది అదే స్థానంలో ఉండటం విశేషం. మొత్తం 15,058 మంది పరీక్షకు హాజరుకాగా 9548 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 56.13, బాలికలు 71.64గా నిలిచారు.
- ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 74.39 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానం పొందడం విశేషం. గతేడాది 8 స్థానంలో ఉండగా.. ఈసారి మెరుగైంది. మొత్తం 13,407 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 9974 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 69.14, బాలికలు 79.99గా నిలిచారు.
- ఒకేషనల్ ఫలితాల్లో ఈసారి జిల్లా కొంత వెనకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 42.64 శాతంతో 32 స్థానంలో నిలిచింది. గతేడాది జిల్లా 31 స్థానంలో ఉంది. మొత్తం 1543 మంది హాజరుకాగా, 658 మంది ఉత్తీర్ణులయ్యారు.
- ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 57.62 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 29 స్థానాన్ని అందుకుంది. గతేడాది 28 స్థానంలో నిల్చింది. మొత్తం 1437 మంది పరీక్షలు రాయగా 828 మంది ఉత్తీర్ణులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు