logo

డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

తాడికల్ వద్ద జాతీయ రహదారిపై మినీ డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు  తీవ్రంగా గాయపడ్డారు.

Published : 15 May 2024 14:05 IST

శంకర్‌పట్నం: తాడికల్ వద్ద జాతీయ రహదారిపై మినీ డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు  తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న మినీ డీజిల్‌ ట్యాంకర్‌  శంకర్‌పట్నం మండలం తాడికల్‌ వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి  బోల్తాపడింది. ప్రమాదంలో తాడికల్‌ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్‌(38) అనే వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్‌కు వెళ్లేందుకు రోడ్డుపక్కన నిలబడి ఉన్న చింతగుట్ట గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, తాడికల్‌కు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  సమాచారం అందుకున్న హుజూరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ జీ , ఎస్సైలు లక్ష్మారెడ్డి, ఆరోగ్యం ఘటనాస్థలికి  చేరుకుని  బోల్తాపడిన ట్యాంకర్‌ను జేసీబీ సాయంతో  పక్కకు తొలగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రహదారి పక్కన ట్యాంకర్‌ బోల్తా పడటంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని