హైరిస్క్లో 52 శాతం మంది
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఆరోగ్య శాఖ సర్వేలో గుర్తింపు
రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
న్యూస్టుడే, సారంగాపూర్: జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ తమ సిబ్బంది ద్వారా ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాలు నమోదు చేశారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 11 లక్షలకు పైగా ఉండగా ఇందులో 30 ఏళ్లు దాటిన వారిలో 52 శాతం మంది ఏదో ఒక రకమైన వ్యాధికి దగ్గరగా ఉంటూ హైరిస్క్లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రక్తపోటుతో 26 శాతం, మధుమేహంతో 13 శాతం, క్యాన్సర్తో 0.03 శాతం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 31,141 మంది రక్తపోటు, 13,523 మంది మధుమేహం, క్యాన్సర్తో 501 మంది, మధుమేహం, రక్తపోటు కలిపి ఉన్న వారు 4,270 మంది ఉండగా, వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. వాస్తవంగా అంతకంటే ఎక్కువగానే ఆయా వ్యాధులతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.
సమగ్ర సమాచారం
రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు, హృద్రోగ, నరాల సమస్యలు, ఫిట్స్, వైకల్యం, దీర్ఘకాలిక తలనొప్పి, కండరాల నొప్పులతో ఇంకేమైనా సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మద్య, దూమపానంతో చెడు అలవాట్లపై ఆరా తీశారు. దీని ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, సాధారణ లక్షణాలతో బాధపడుతున్న వారిని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ప్రతి ఇంటికి సంబంధించిన ఆరోగ్య సమాచార వివరాలను వైద్యశాఖ నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే రోగాలపై ముందుగానే అంచనాలు వేసుకోవచ్చని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రభుత్వం పట్టణాల్లో బస్తీ, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. పల్లె దవాఖానాల్లో ప్రస్తుతం సాధారణ ఓపీ, గర్భిణులకు పరీక్షలు, చిన్నపిల్లలకు టీకాలు, అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ, మందుల పంపిణీ సేవలు అందుతున్నాయి. రక్త, మూత్ర నమూనాలను సేకరించి, సమీపంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపించి, ఫలితాల నివేదికలను ఆన్లైన్లో పొందుపరిచి బాధితులకు పరీక్షల రిపోర్టు ప్రింట్ రూపంలో అందజేస్తున్నారు.
మెరుగైన వైద్యం
ప్రతి కుటుంబ వివరాలను ఆరోగ్య శాఖ వద్ద ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశముంది. జిల్లాలో కుటుంబాల వారీగా ఆరోగ్య వివరాలు సేకరించాం. జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారు 52 శాతం హైరిస్క్లోనే ఉన్నారు. ఉప కేంద్రాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మందుల పంపిణీ కొనసాగిస్తున్నాం. ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ ద్వారా మున్ముందు మరింత వైద్య సేవలు అందనున్నాయి.
షమీయోద్దిన్, దీర్ఘకాలిక వ్యాధుల జిల్లా ప్రోగ్రాం అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం