logo

వైభవంగా నారసింహుడి చందనోత్సవం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

Published : 19 May 2024 04:32 IST

స్వామివారికి చందనోత్సవ అలంకరణ 

ధర్మపురి, న్యూస్‌టుడే : ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు అన్ని అనుబంధ ఆలయాల్లో పురుషసూక్త, శ్రీ సూక్త విధానంతో న్యాస పూర్వకంగా షోడషోపచార పూజలు, పంచోపనిషత్తులతో అభిషేకాలు, వేద పారాయణాలు నిర్వహించారు. చందనాన్ని స్వామి వారి మూల విగ్రహానికి విలేపనం చేసి, చందనోత్సవాన్ని నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని