అర చేతిలోనే కథలు చదివేద్దాం!
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి.
వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రయోజనం
న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం: వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. ఆన్లైన్ గేములకు అత్తుకుపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను కథలు చదివేలా ప్రోత్సహించాలి. పాఠ్య పుస్తకాలలోని పాఠాలను కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని చదువుకోవచ్చు. పఠానాసక్తి పెంచాలనే రూమ్ టు రీడ్ సంస్థ లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ రూపొందించింది. ఇందులో ఎనిమిది భాషల్లో ఉన్న కథలను పొందుపర్చింది. ఈ కథలను చదవడంతో ప్రాథమిక దశలో విద్యార్థుల్లో మౌఖిక భాషా వికాసం, అభ్యసనా సామర్థ్యం వృద్ధి చెందుతుంది.
ఆడియో పాఠాలకు శ్రీకారం
కరోనా సమయంలో పాఠశాలలు మూతపడి పిల్లలు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా విద్యావంతులు వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు శతక పద్యాలను ఆడియో రికార్డింగ్ చేసి కృత్య పత్రాలు తయారు చేశారు. విద్యా శాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో పుస్తకాలలోని పాఠాలను రికార్డింగ్ చేసి విద్యార్థులకు అందుబాటులో వెబ్సైట్లో పెట్టారు. కేబీ.శర్మతోపాటు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్తోపాటు కొందరు తెలుగు పండితులు, ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలను ఆడియో రికార్డింగ్ చేశారు. పాఠ్య పుస్తకంపై ఉండే క్యూఆర్ కోడ్ సహాయంతో పాఠాలను వినవచ్చు.
లిటరసీ క్లౌడ్ సహాయంతో..
‘రూమ్ టు రీడ్’ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ సమన్వయంతో వేసవి సెలవుల్లో నచ్చిన కథలు చదివేందుకు లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ను అభివృద్ధి చేశారు. మౌఖిక భాషాభివృద్ధి, అభ్యసన సామర్థ్యాల పెంపు, విషయ అవగాహన శక్తి పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది. పిల్లల స్థాయిని బట్టి ఆకర్షణీయ బొమ్మలతో హిందీ, ఆంగ్లంతోపాటు ఎనిమిది భాషల్లో 1200 పైచిలుకు పుస్తకాలను వెబ్సైట్లో ఉంచారు. ఆంగ్లంలో 406, తెలుగులో 117, మరాఠీ, హిందీ, గుజరాతీ, కన్నడ భాషల్లోనూ కథలను ఉంచారు.
వెబ్సైట్ను ఇలా వినియోగించుకోవాలి
గూగుల్ సెర్చ్లో www.literacycloud.orgtories/language/ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఇందులో కోరిన భాషలో కథల పుస్తకాలను ఎంచుకొని చదువుకోవచ్చు. అనంతరం సంబంధిత కథను ఇతరులకు చెప్పడం, బొమ్మలు గీయడం, వ్యాక్యాల్లో రాయడం ద్వారా విద్యార్థి భాషా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లల వాట్సాప్ గ్రూపులో ఈ వెబ్సైట్పై అవగాహన కల్పించి ఉపయోగించుకునేలా చూడాలి. తల్లిదండ్రులు కూడా ఈ కథలను వినడానికి మొబైల్ ఫోన్లను పిల్లలకు ఇచ్చి పర్యవేక్షించాలి. ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా కథలు వినవచ్చు.
నాలుగు లక్షల మంది విద్యార్థులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,19,680, జగిత్యాలలో 1,31,948, పెద్దపల్లిలో 84,089 మంది, రాజన్న సిరిసిల్లలో 65,466 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వేసవిలో బాలల అభ్యసనా సామర్థ్యం పెంచేందుకు.. ఆసక్తి ఉన్న కథలను చదివించడం.. వినేలా చూడాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రతిరోజు కొత్త కథలు
విద్యార్థులు ఏ రోజుకారోజు కొత్త కథను వినేందుకు రూమ్ టు రీడ్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్ను ప్రకటించింది. 040-4520-9722 నంబర్కు డయల్ చేయడం ద్వారా విద్యార్థులకు అభిరుచి కల్గించే తెలుగు కథలు వినవచ్చు. లిటరసీ క్లౌడ్ వెబ్సైట్, క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకొని శ్రవణ, పఠనా నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం