మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
కోడ్ సమయంలో రూ.85.22 కోట్ల విక్రయాలు
న్యూస్టుడే, సిరిసిల్ల కలెక్టరేట్
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లాలో ఆబ్కారీశాఖ అధికారులు బెల్టుషాపులు మూసివేసినప్పటికీ ఎన్నికల కోడ్ రాకముందు సాగిన మాదిరిగానే అమ్మకాలు జరగడం గమనార్హం. గడిచిన రెండు నెలల్లో రూ. 85,22,08,804 విక్రయాలు సాగినట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 48 మద్యం దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. వీటిపై ఆబ్కారీశాఖ అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు, సిబ్బంది రోజూ గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మద్యంతో పాటు సారా, బెల్లం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో గుడుంబా 4,826 లీటర్లు, మద్యం 193.695 లీటర్లు, బీర్లు 228.94 లీటర్లు పట్టుకున్నారు. వీటి విలువ రూ.22.69 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు 52 మందిపై 133 కేసులు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
చల్లని బీర్లకే మొగ్గు
పార్లమెంటు ఎన్నికలు మద్యం అమ్మకాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. వేసవి తీవ్రత నేపథ్యంలో మద్యం కంటే ఎక్కువగా బీర్ల విక్రయాలే సాగాయి. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం ప్రియులు చల్లని బీర్లను ఎక్కువగా వినియోగించారు. దీంతో పరిమిత సంఖ్యలో స్టాకు రావడంతో సాయంత్రం వేళల్లో వాటిని చల్లబరిచే వరకు కూడా వినియోగదారులు ఆగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఒక వ్యక్తి 5 బాటిళ్ల మద్యంతో పాటు 6 బీర్లు తీసుకెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు గ్రామాల్లో బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయనున్నారు.
విస్తృతంగా తనిఖీలు
ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి మద్యం అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సాధారణ రోజుల మాదిరిగానే సాగాయి. జనవరిలో రూ. 43.96 కోట్ల ఆదాయం రాగా, ఫిబ్రవరిలో రూ. 45.96 కోట్లు వచ్చింది. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైనప్పటి నుంచి మే 17 నాటికి మొత్తం రూ.85,22,08,804 ఆదాయం వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. గుడుంబా తయారీదారులతోపాటు బెల్టుషాపుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే ఆబ్కారీ శాఖకు సమాచారం అందించాలి. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం.
పంచాక్షరి, జిల్లా ఆబ్కారీ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?