logo

అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల సన్నాహక సమావేశం

సిరిసిల్ల పట్టణంలోని అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

Updated : 20 May 2024 05:23 IST

సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

సిరిసిల్ల కలెక్టరేట్, న్యూస్‌టుడే: సిరిసిల్ల పట్టణంలోని అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో 11 మందితో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీలో రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, శీలం రాజు, గూడూరి భాస్కర్, బొల్గం నాగరాజు, పత్తిపాక సురేశ్, దుమాల శ్రీకాంత్, బక్రం లక్ష్మి, అన్నల్‌దాస్‌ వేణులు ఉన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, చందు, నవీన్‌యాదవ్, విజయ్, నరేశ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని