ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
వీధి దీపాలు లేకపోవడంతో ప్రధాన రహదారిలో గౌతమినగర్ వద్ద నెలకొన్న అంధకారం
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదే రోడ్డులో వారాంతపు సంతతో పాటు వివిధ మతాలకు చెందిన దేవాలయాలు ఉండటంతో భక్తులతో రద్దీగా ఉంటుంది.
ప్రధాని వస్తున్నారని...
రామగుండం ఎరువుల కర్మాగారానికి అత్యంత ఉపయోగపడే ఈ రోడ్డును ఆర్.ఎఫ్.సి.ఎల్. నిధులతోనే నిర్మించాల్సి ఉన్నప్పటికీ సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని రూ.2.62 కోట్లు రామగుండం నగరపాలిక నిధులతో ప్రగతినగర్ నుంచి ఎన్టీపీసీ టౌన్షిప్ వరకు హడావుడిగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. నగరంలోని ఐదు డివిజన్లలో వివిధ డివిజన్లలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కోసం కేటాయించిన నిధులు రూ.2.62 కోట్లు మళ్లించి ప్రగతి నగర్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రధాని వస్తున్నందున అత్యవసరంగా నగరపాలిక నిధులతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నప్పటికీ తిరిగి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఈ నిధులను నగరపాలికకు చెల్లించాలనే షరతుతో రోడ్డు నిర్మించినప్పటికీ నిధులు తిరిగి రాబట్టుకోవడాన్ని నగరపాలిక విస్మరించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రామగుండం నగరపాలిక, రామగుండం ఎరువుల కర్మాగారం సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ సమస్య పరిష్కారానికి నోచుకోనుంది.
పరిశ్రమకు ప్రోత్సాహకంగా...
మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం స్థానంలో ఆర్.ఎఫ్.సి.ఎల్. ఆధ్వర్యంలో కర్మాగారం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తన వంతు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల రవాణా కోసం రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి రాజీవ్ రహదారిని కలిపేలా ప్రధాన రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువుల కర్మాగారం నుంచి రాజీవ్ రహదారి వరకు రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఎరువుల కర్మాగారం, ఫెర్టిలైజర్ సిటీ అంతర్గత, ప్రధాన రహదారులను నిర్మించారు. మిగిలిన నిధులతో గౌతమినగర్ రైల్వే ట్రాకు నుంచి ప్రగతినగర్ వరకు రోడ్డు, డివైడర్లు నిర్మించారు. ఫెర్టిలైజర్ సిటీ టౌన్షిప్తో పాటు ఎరవుల కర్మాగారం ప్రధాన, అంతర్గత రహదారుల్లో విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేసినప్పటికీ గౌతమినగర్ నుంచి ప్రగతినగర్ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. రామగుండం నగరపాలక నిధులు రూ.2.62 కోట్లతో ప్రగతి నగర్ నుంచి ఎన్టీపీసీ టౌన్షిప్ రింగ్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటికీ డివైడర్లు, వీధి దీపాలు లేకపోవడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే