మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు.
ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు పురపాలక సంచాలకుల ఆదేశాలు
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం, కరీంనగర్ సుభాష్నగర్
రామగుండం నగరపాలక కార్యాలయం
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. ఇదే తరహాలో ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయినీలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. గతంలో ఓ ప్రజాప్రతినిధి తనను మరో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి లైంగికంగా వేధిస్తున్నాడంటూ’ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో పురపాలక నిర్వహణ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పుర, నగరపాలికల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేకంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పురపాలక సంచాలకులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా పుర, నగరపాలికల్లో కమిటీల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు 2013లో రూపొందించిన చట్టం ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
కమిటీల ఏర్పాటు ఇలా...
నగర, పురపాలికల్లో పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపుల బారిన పడకుండా ఏర్పాటు చేయనున్న అంతర్గత కమిటీల్లో మహిళలే ప్రిసైడింగ్ అధికారిణిగా, సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఆ స్థాయిలో ఆయా పురపాలక, నగరపాలికల్లో మహిళా ఉద్యోగినులు లేనట్లయితే ఇతర శాఖల్లోని ఉద్యోగినులతో కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా పురపాలక సంచాలకులు తమ ఉత్తర్వుల్లో మార్గదర్శనం చేశారు. సీనియర్ ఉద్యోగినిని ప్రిసైడింగ్ అధికారిణిగా, మరో ఇద్దరు ఉద్యోగినీలను సభ్యులుగా నియమిస్తారు. మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒక మహిళను పుర, నగరపాలిక అంతర్గత ఫిర్యాదుల కమిటీలో సభ్యురాలిగా నియమిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికలతో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, జగిత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్, కొత్తపల్లి, జమ్మికుంట, వేములవాడ తదితర పురపాలికల్లో ఈ కమిటీల ఏర్పాటునకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తికానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి