సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు.
29 నుంచి కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
న్యూస్టుడే, మల్యాల
కొండగట్టు ఆంజనేయ ఆలయం
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిర్వహించలేదు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా తలెత్తిన సమస్యలు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఏటా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా అధికారులు ఆలయానికి రంగులు వేయిస్తుంటారు. పది రోజుల్లో ఉత్సవాలు జరగనున్నప్పటికీ ఆలయానికి రంగులు వేసే పనులు చేపట్టలేదు. హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాలకు రూ.76.50 లక్షలతో ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు గతంలో వెల్లడించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రంగులు వేసేందుకు టెండర్లు పిలిచే అవకాశం లేనందున ఆలయ పరిధిలోని వ్యాపారుల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పనులు ప్రారంభించినట్లు ఈవో తెలిపారు. కొండపైన పుష్కరిణిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించి కొత్త నీటిని నింపాలి, మెట్లపక్కన జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీక్షాపరులు వదిలేసే దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. చిన్న జయంతి ఉత్సవాల చివరి రోజు మాత్రమే అధికారులు కొండపైకి ఆర్టీసీ బస్సును నడిపించారు. ఈనెల 29 నుంచి జూన్ 1 వరకు కొండగట్టు స్టేజి నుంచి దొంగలమర్రి, జేఎన్టీయూ మీదుగా కొండపైన ‘వై’జంక్షన్ వరకు మినీ బస్సులను నడిపిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఘాట్రోడ్డు, బొజ్జపోతన్న సమీపంలో రహదారులకు ఇరువైపులా చలివేంద్రాలను ఏర్పాటు చేసి రక్షిత నీటిని సరఫరా చేయాలి. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన ఎండలో నడిచి వచ్చే దీక్షాపరుల కోసం ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. తలనీలాలు సమర్పించే చోట ఘర్షణ సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు, అక్రమ వసూళ్లపై కూడా దృష్టి సారించాలి. వాహన పార్కింగు స్థలాల్లో కూడా నీడ, నీటి వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆలయ పరిసరాల్లో వేసిన చలువపందిళ్లను సరిచేసి, ఇతర ప్రాంతాల్లో కూడా పందిళ్లు నిర్మిస్తే దీక్షాపరులు సేదతీరే అవకాశం ఉంది. జయంతి రోజుకు ముందు అర్ధరాత్రి భక్తుల తోపులాట జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బందోబస్తు, బారికేడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించాం. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్ కారణంగా ఆలయానికి రంగులు వేసేందుకు టెండర్లు నిర్వహించే ప్రక్రియకు పాలనాపరమైన మంజూరు అవకాశం లేకపోవడంతో వర్తకం సంఘం సభ్యులు అందజేసే రూ.2 లక్షలతో రంగులు వేయిస్తున్నాం.
చంద్రశేఖర్, ఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే