పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
న్యూస్టుడే, కరీంనగర్ మంకమ్మతోట
మార్కెట్ యార్డులో మామిడి కాయలు
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో సగటున కిలో ధర రూ.30 పలికిన మామిడి రెండు రోజులుగా రూ.20కు పడిపోయింది.
కరీంనగర్ మార్కెట్ యార్డులో గత నెల 7న మామిడి మార్కెట్ ప్రారంభమైంది. అప్పుడు బరువు ఎక్కువగా ఉండే కాయలకు సైతం సగటున కిలోకు రూ.45 ధర పలికింది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు కాత చివరి దశకు రావడంతో శుక్రవారం కనిష్ఠ ధర కిలో రూ.5 మాత్రమే పలకగా, గరిష్ఠంగా రూ.30 పలికింది. మార్కెట్ ప్రారంభమైన కొత్తలో బంగినపల్లి, దసేరి, తోతాపురి మామిడి రకాలను రైతులు తీసుకురాగా, గడిచిన పది రోజులుగా కేవలం బంగినపల్లి రకం మాత్రమే మార్కెట్కు వస్తోంది. గతేడాది అన్ని రకాల మామిడి కలిపి 6,117 మెట్రిక్ టన్నులను రైతులు మార్కెట్కు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అన్ని రకాల మామిడి కలిపి ఇప్పటి వరకు 6,619 మె.ట కొనుగోలు జరిగింది. దీనిలో 5,960 మె.ట బంగినపల్లి రకమే ఉంది. మిగిలినవి దసేరి, తోతాపురి రకాలున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఇంకా కొన్ని మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ సిబ్బంది తెలిపారు.
నష్టపోతున్న రైతులు..
వరి, మొక్కజొన్న తదితర పంటల మాదిరిగా మామిడి పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మార్కెట్కు అధిక సంఖ్యలో సరకు రావడంతో కమీషన్ ఏజెంట్లు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. రవాణా ఖర్చులతో మార్కెట్కు మామిడిని తీసుకొచ్చిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తోందని తెలిపారు.
క్రయ విక్రయాలు ఇలా..
మార్కెట్లో రైతుల దగ్గరి నుంచి మామిడి నాణ్యతను బట్టి గరిష్ఠ, కనిష్ఠ ధరలకు కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ధరలో ఒక శాతం కమీషన్ను మార్కెట్ కమిటీకి చెల్లిస్తారు. కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిన మామిడికాయలు, పండ్లను వాటి తీరును బట్టి గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ట్రెడర్స్తో ధర కుదుర్చుకొని ఎగుమతి చేస్తారు. మార్కెట్కు వచ్చే మామిడిలో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. మన దగ్గరి నుంచి ముఖ్యంగా దిల్లీ, హరియాణ, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం.
కూలీలు సైతం ఇతర రాష్ట్రాల వారే..
మామిడి సీజన్ నడిచినన్ని రోజులు ఇక్కడ పని చేయడానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వస్తారు. కొనుగోలు చేసిన మామిడి గ్రేడింగ్, ప్యాకింగ్, లోడింగ్ తదితర పనులన్నీ వారే చేస్తారు. ఈ నెలాఖరుతో మామిడి సీజన్ ముగియగానే వారు స్వస్థలాలకు వెళ్లిపోతారు.
కనీస వసతులు కల్పిస్తాం
మామిడి మార్కెట్ నడిచినన్ని రోజులు ఇక్కడికి వచ్చిన వారందరికీ కనీస వసతులైౖన తాగునీరు, విద్యుత్తు తదితర కనీస సదుపాయాలు కల్పిస్తాం. ఈసారి మామిడి దిగుబడి అధికంగా వచ్చింది.
పురుషోత్తం, మార్కెట్ కమిటీ కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు