సా..గుతున్న అభివృద్ధి పనులు
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది.
న్యూస్టుడే, రాయికల్ పట్టణం
అసంపూర్తిగా రివిట్మెంట్ పనులు
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కట్ట వెడల్పు, రివిట్మెంట్, పార్క్ అభివృద్ధి, కర్బాస్ వాల్, రెయిలింగ్, మెట్ల నిర్మాణం, రిటర్నింగ్ వాల్ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. 2018లో నిధులు మంజూరు కాగా 2022లో టెండర్ ప్రక్రియ ముగించుకొని పనులు ప్రారంభమయ్యాయి. కాగా రెండు సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలకు చెరువు నిండుతుండటంతో వేసవిలోనే పనులు చేయాల్సి ఉంటుంది. కాగా గుత్తేదారులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందాన పనులు చేపడుతున్నారు.
మెట్ల నిర్మాణం, రిటర్నింగ్ వాల్ పనులు గతంలో పూర్తయినా పనుల్లో నాణ్యత లోపించి కంకర తేలడంతో పైపై పూతలు పూసి మరమ్మతులు చేశారు. వర్షాకాలంలో భారీ వర్షాలకు చెరువు కట్ట వెడల్పు కోసం పోసిన మట్టి కోతకు గురికాగా ఇటీవల మళ్లీ మొరం పోసి చదును చేశారు. ప్రస్తుతం చెరువు కట్టకు రివిట్మెంట్ పనులు ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయాయి. యాంత్రిక జీవనంలో కాస్త ఉపశమనం పొందేందుకు అహ్లాదరక వాతావరణం లేక పట్టణ ప్రజలు అల్లాడుతుండగా ఉద్యానవనం ఏర్పాటు చేయాల్సిన స్థలం అభివృద్ధి చేయడం మినహా మొక్కలు నాటేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పార్క్ ఏర్పాటు చేయాల్సిన స్థలంలో పెద్ద పెద్ద బండరాళ్లు తొలగించాల్సి ఉంది. పనుల పర్యవేక్షణ సజావుగా జరిపి నాణ్యతతో పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
80 శాతం పనులు పూర్తి
వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం చెరువులో నీరు లేకపోవడంతో ఇటీవలే రివిట్మెంట్ పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 70-80 శాతం పనులు పూర్తయ్యాయి. వర్షాలు కురిసి చెరువు నిండేలోపు మిగతా పనులు పూర్తవుతాయి. పనుల్లో నాణ్యత కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఉద్యానవనం ఏర్పాటు కోసం స్థలం అభివృద్ధి చేయడం మాత్రమే గుత్తేదారు పని. మొక్కలు నాటడం, పార్క్లో ఇతర అభివృద్ధి పనులు కాంట్రాక్టులో లేవు.
భాస్కర్, ఇరిగేషన్ డీఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.