కనిపిస్తే కరుస్తున్నాయ్!
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి.
జిల్లాలో పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
న్యూస్టుడే, జగిత్యాల, రాయికల్
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం ఇటీవల కుక్కలు అనేక మందిని గాయపరిచాయి. రాయికల్ ఆసుపత్రిలో జనవరి నుంచి ఇప్పటి వరకు కుక్కల దాడులకు గురై 360 మంది చికిత్స పొందారు. జిల్లాలో గత అయిదు నెలల్లో సుమారు 2200 మందికి పైగా చికిత్స తీసుకున్నారు. వీధుల్లో విచ్చలవిడిగా బయట పడివేసిన మాంసం, కోళ్ల వ్యర్థాలకు కుక్కలు రావడం వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి తాగునీరు దొరక్క పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడుల నియంత్రణపై పంచాయతీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
లెక్కలు లేవు..
జిల్లాలో పెంపుడు కుక్కలకు యజమానులు ఎప్పటికప్పుడు వైద్యం చేయిస్తుండడంతో పట్టణాలు, గ్రామాల్లో పశు వైద్యాధికారులకు తెలిసినప్పటికీ వీధికుక్కలకు మాత్రం లెక్కలు లేవు. పట్టణాల్లో వందల సంఖ్యలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ వీధికుక్కల సంఖ్య అధికంగానే ఉంది. పెంపుడు కుక్కలకు యజమానులు వైద్యుల సూచనల మేరకు టీకాలు వేయిస్తుంటారు. ఆహార నియంత్రణ, యజమాని పర్యవేక్షణ ఉండటంతో ఎవరినైనా గాయపర్చినా ఎలాంటి ప్రమాదం ఉండదు. వీధి కుక్కలకు ఎలాంటి టీకాలు వేయకపోవడంతో దాడి చేస్తే ప్రమాదకరంగా మారవచ్చు. వీధి కుక్కల్లో ఎక్కువగా రేబిస్ లక్షణాలు ఉంటాయి. అవి కరిస్తే వెంటనే వైద్యం చేయించుకోకపోతే ప్రాణాపాయం తప్పదు. రేబిస్ సోకిన కుక్కలు గాయపర్చితే సమీపంలోని ఆసుపత్రులలో యాంటీ రేబిస్ టీకాలు కచ్చితంగా వేసుకోవాలి.
రాయికల్లో కుక్కకాటుతో అయిన గాయాలు
ప్రభుత్వ ఆసుపత్రులకు...
జిల్లాలో 20 మండలాలు, అయిదు పట్టణాల్లో సుమారు 10.50 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి సామాజిక ఆసుపత్రులు, మండల, అర్బన్ కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. కుక్క కాటుకు గురైతే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన కుక్కల పరిస్థితి, గాయం తీరును బట్టి కుక్క కాటుకు చికిత్స అందించాల్సి ఉంటుంది. కుక్కలు లేదా ఇతర జంతువులు గాయపర్చినా దాడి చేసినా యాంటీ రేబిస్ టీకాలు వేసుకోవాలి. పిచ్చి కుక్కల దాడులు గాయం తీవ్రంగా ఉంటే యాంటి రేబిస్ వ్యాక్సిన్తో పాటు ఇమ్యూనోగ్లోబిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కల గాయాలకు సంబంధించిన మందుల ధరలు అధికంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కుక్కకాటు చికిత్సకు కనీసం రూ.10వేలకు పైగానే ఖర్చవుతుంది.
అందుబాటులో టీకాలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక, అర్బన్ ఆసుపత్రుల్లో కుక్కలు ఇతర జంతువులు దాడులు చేస్తే ఏ.ఆర్.వి.టీకాలు అందుబాటులో ఉన్నాయి. కుక్కలు దాడులు చేస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలి. అన్ని ఆసుపత్రులలో చికిత్స అందించడానికి సిబ్బందికి సూచనలు అందించాం. జిల్లాలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కొరత లేదు.
ఎన్.శ్రీనివాస్, జిల్లా ఉపవైద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే