logo

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated : 20 May 2024 16:43 IST

ధర్మపురి గ్రామీణం: సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. పురుష, సూక్త, కల్పోక్త వ్యాసపూర్వక శోడశోపచార పూజ, సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని తులసితో అలంకరించారు. అన్నకుటోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని