logo

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జుల నియామకం

ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారాస తరఫున ఇన్‌ఛార్జులుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియమించారని భారాస

Published : 21 May 2024 02:43 IST

ఉమ్మడి వరంగల్‌కు కరీంనగర్‌ భారాస నేతలు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారాస తరఫున ఇన్‌ఛార్జులుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియమించారని భారాస కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కె.సంజయ్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌లను ఇన్‌ఛార్జులుగా నియమించారని చెప్పారు. వరంగల్‌ తూర్పు ఇన్‌ఛార్జులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్, కరీంనగర్‌ మేయర్‌ వై.సునీల్‌రావు, భారాస కరీంనగర్‌ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌లు, వర్ధన్నపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జనగామ నియోజవర్గానికి భారాస రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌కు మాజీ ఎమ్మెల్యే సుంకె.రవిశంకర్, పాలకుర్తి నియోజకవర్గానికి భారాస నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహరావు, నర్సంపేట నియోజకవర్గానికి పి.రవీందర్‌రావును నియమించారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని