రాయితీల్లో కోత.. నేతన్నల వెత
వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు.
మారిన విధానంతో ఏటా రూ.2 కోట్ల మేర నష్టం
భీములు చుట్టేందుకు ఉపయోగించే నూలు కండెలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు చెల్లింపులు.. రాయితీలు విడుదలపైనే ఆశలు పెట్టుకున్నవారికీ నిరాశే ఎదురవుతోంది. బతుకమ్మ చీరల్లో పదిశాతం నూలు రాయితీ చెల్లింపులకు బదులు.. పనిచేసిన కూలీ చెల్లింపులపై లెక్కగట్టి ఇవ్వడంతో కార్మికులు నష్టపోతున్నారు. తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కడంలేదంటూ ప్రభుత్వం రాయితీ చెల్లింపుల విధానాన్ని మార్చాలని కార్మికులు ఆందోళన బాటపడుతున్నారు.
ఇదీ పరిస్థితి
బతుకమ్మ చీరల ఉత్పత్తిలో భాగస్వాములైన కార్మికులకు కూలీ సర్దుబాటు కింద పదిశాతం నూలు రాయితీ బోనస్గా అందేది. ఇలా జిల్లాలోని అయిదువేలకు పైగా కార్మికులకు 2018 నుంచి 2021 వరకు చెల్లించారు. కార్మికులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు పదిశాతం రాయితీతో మీటరుకు రూ.1.42 చొప్పున ఏటా సుమారు రూ.8.50 కోట్ల మేరకు చెల్లింపులు జరిగేవి. జిల్లాలోని కార్మికులందరికీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుండేది. నూలు రాయితీ చెల్లింపులు పూర్తిగా టెస్కో నుంచి జరుగుతాయి. దీనికి అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులేవీ విడుదల చేయలేదు. వీటితోపాటు మరికొన్ని రకాల చెల్లింపులకు సైతం సరైన ఉత్తర్వులేకుండా జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. చెల్లింపులు జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి టెస్కోకు ఎలాంటి నిధుల విడుదల కాలేదు. కాగా ప్రభుత్వం మారడంతో చేనేత, జౌళీశాఖ ఇలాంటివి పూర్తిగా పక్కన పెట్టింది. లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలోని వివిధ వర్గాల నేతన్నలు, కార్మిక సంఘాలు రాష్ట్ర చేనేత, జౌళీశాఖ కమిషనర్ను కలిసి ప్రభుత్వ ఆర్డర్ల ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు, కార్మికులకు రావాల్సిన రాయితీలను విడుదల చేయాలని మొర పెట్టుకున్నారు. వస్త్రోత్పత్తులకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 2022కి సంబంధించిన కార్మికుల నూలు రాయితీని పోలింగ్కు రెండ్రోజుల ముందు 170 మంది ఖాతాలో నేరుగా జమ చేశారు. కార్మికులు వారు ఉత్పత్తిచేసిన వస్త్రానికి.. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తానికి సరిచూసుకుంటే తేడా ఉంది. ఈ విషయమై రాష్ట్ర చేనేత, జౌళీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు వారు పదిశాతం నూలు రాయితీ రూపకంగా కాకుండా ఆ సంవత్సరం కార్మికుడు బతుకమ్మ చీరల ఉత్పత్తిచేసిన మీటర్లతో పొందిన వేతనం నుంచి 20 శాతం చెల్లించినట్లు లెక్కచెప్పారు. దీంతో మీటరుకు రూ.1.42 రావాల్సింది. సగటున రూ.1.05 మాత్రమే వస్తుంది. ఈ విధానంతో ప్రతి కార్మికుడు సుమారు 42 పైసలు నష్టపోతున్నారు. ఇలా చెల్లించడం వలన జిల్లాలోని కార్మికులు ఏటా సుమారు రూ.2.కోట్ల మేరకు నష్టపోవాల్సిన పరిస్థితి. దీనిపై గత నాలుగు రోజులుగా కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు.
టెక్స్టైల్ పార్కులో మరోలా..
టెక్స్టైల్ పార్కులో బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి 2022, 2023లో జాకెట్ వస్త్రం ఆర్డర్లు ఇచ్చారు. ఇక్కడి మరమగ్గాలపై రెండు పన్నాలు ఉత్పత్తి అవుతాయి. మీటరుకు రూ.1.50 చొప్పున రెండు పన్నాలకు కలిపి రూ.3 చెల్లిస్తారు. ఇక్కడ కూడా కూలీ సర్దుబాటు కింద రెండు పన్నాలకు కలిపి నూలు రాయితీ చెల్లిస్తామని కార్మిక సంఘాలకు చేనేత, జౌళీశాఖ, పార్కు యాజమాన్యం నచ్చజెప్పారు. పదిశాతం నూలు రాయితీలో 30 పైసల చొప్పున రెండు పన్నాలకు రూ.60 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఇక్కడ పనిచేసిన కార్మికులు తాము కష్టపడిన దానిలో సగానికిపైగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితోపాటు నేతన్నలకు చేయూత (త్రిఫ్ట్) పథకానికి సంబంధించి కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు బ్యాంకులకు జమ కావడం లేదు. పరోక్షంగా కార్మికులు ప్రతినెలా వడ్డీని నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ