ప్రజా పంపిణీలో నిత్యావసర సరకులు
రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
బియ్యంతో పాటే అందజేయాలని ప్రభుత్వ యోచన
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం
న్యూస్టుడే, గోదావరిఖని: రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిన నేపథ్యంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పంపిణీ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో పాటు పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు బియ్యం, మరో తొమ్మిది రకాల సరకుల పంపిణీ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం నివేదిక కోరినట్లు సమాచారం. ఈ అంశం కార్యరూపం దాలిస్తే జిల్లాలోని పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు అందే అవకాశం ఏర్పడనుంది. జిల్లాలో 413 రేషన్ దుకాణాలుండగా 1,21,950 తెల్ల కార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా 3,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
తెరపైకి ‘అమ్మహస్తం’
రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రూపాయికి కిలో చొప్పున బియ్యం అందజేస్తుండగా పప్పు, నూనె, చింతపండు, కారంపొడి, పసుపు, ఉల్లిగడ్డ, పంచదార వంటి సరకులు పంపిణీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ హయాంలో 2012లో ఉగాది సందర్భంగా ‘అమ్మహస్తం’ పేరిట నిత్యావసర సరకుల పంపిణీని ప్రారంభించారు. ఆ సమయంలో తక్కువ ధరకు బియ్యంతో పాటు కిలో చొప్పున ఉల్లిగడ్డ, వంట నూనె, కారంపొడి, ఉప్పు, కందిపప్పు, చింతపండు, పంచదార, పసుపు ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేశారు. అలా పంపిణీ చేసిన సరకులు పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపోయేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మహస్తం పథకాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి కేవలం రూపాయికి కిలో బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో నిత్యావసరాలను బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.
తగ్గనున్న ఆర్థిక భారం
రాష్ట్రంలో అయిదు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగా తిరిగి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని భావిస్తోంది. దీంతో నిరుపేదలపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకం పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో బియ్యంతో పాటు గోధుమలు కూడా పంపిణీ చేసే వారు. నిత్యావసరాలతో పాటు ఇంకా ఏమైనా సరకులు పంపిణీ చేయవచ్చా? అన్న కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు మండిపోతుండటంతో పేద కుటుంబాలపై ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.2000 వరకు ఆర్థిక భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..