అధ్వాన రోడ్లు.. తప్పని అవస్థలు
కోరుట్ల పట్టణంలోని సిమెంట్రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి.
ఇందిరారోడ్లో దెబ్బతిన్న సిమెంట్రోడ్
న్యూస్టుడే, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని సిమెంట్రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన సీసీరోడ్లు కావడం, మూడేళ్ల క్రితం మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్, ఇంటింటికి కుళాయిల ఏర్పాటు కోసం రోడ్లను తవ్వారు. పైపులైన్ నిర్మాణం తర్వాత సిమెంట్రోడ్లకు మరమ్మతు చేయకుండా వదిలేశారు. పట్టణంలోని 28, 29వ వార్డుల్లో అత్యంత రద్దీగల ఇందిరారోడ్, టిచర్స్క్లబ్రోడ్, ప్రసాద్ సెలక్షన్రోడ్లు పూర్తిగా చెడిపోయాయి. ఈరోడ్లలో బ్యాంక్లు, వస్త్ర వ్యాపారం, స్టీల్ దుకాణాలు, ఆసుపత్రులు, ఏజెన్సీలు, ఇలా అన్ని రకాల దుకాణ సముదాయాలున్నాయి. కూరగాయల మార్కెట్కు, పట్టణంలోని చాలా కాలనీలకు వెళ్లే ప్రధాన దారులు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. దెబ్బతిన్న రోడ్లపై వాహనాలు వెళ్లడం ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి.
చాలా ఏళ్ల కిందట నిర్మించిన కాలువలు దెబ్బతిని అందులో మురుగు నీరు ముందుకు సాగక వారాల తరబడి నిల్వ చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. దారులకు అడ్డుగా ఉన్న మురుగు కాలువల మరమ్మతుల సమయంలో సమాంతరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఎత్తులో నిర్మించడంతో వాహనాల రాకపోకలకు ఇక్కట్లు తలెత్తుతున్నాయి. పట్టణంలో వ్యాపారానికి నిలమయమైన కాలనీలో నూతన సిమెంట్రోడ్లు నిర్మించాలని బల్దియా అధికారులకు, పాలకులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా పట్టించునే వారే కరవయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలువలో నిలిచిన మురుగు
అదుపు తప్పి ప్రమాదాలు
సిమెంట్రోడ్లు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని బల్దియా పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోడ్లపై వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
బెజ్జారపు హరికృష్ణ, మెకానిక్
రద్దీ ఎక్కువగా ఉంటుంది..
చాలా ఏళ్ల కిందట నిర్మించిన సిమెంట్రోడ్లు కావడంతో పూర్తిగా చెడిపోయాయి. నూతన సీసీరోడ్ల నిర్మాణం చేపట్టి వాహనాల, ప్రజల రాకపోకలకు ఇక్కట్లు లేకుండా చూడాలి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు, కూరగాయల మార్కెట్కు వెళ్లే దారులు కావడంతో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు కావడంతో బల్దియాకు పన్నుల రూపకంగా అధిక ఆదాయం సమకూరుతుంది.
అల్లె ధనుంజయ్, విశ్రాంత ఉద్యోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం