సకాలంలో అందేనా!
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు.
మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలు
ఏకరూప దుస్తుల తయారీపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
న్యూస్టుడే, సారంగాపూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ప్రభుత్వం మహిళలకు వడ్డీలేకుండా రూ.కోటి రుణాలు అందిస్తామని ప్రకటించడమే కాకుండా అన్ని శాఖల దుస్తుల తయారీ, ప్రభుత్వ పాఠశాలల ఏకరూప దుస్తుల తయారీ చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్, కస్తూర్బా, ఆదర్శ తదితర పాఠశాలలు దాదాపు 853 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే బాలబాలికలకు ప్రభుత్వం ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 72 కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసి 1,61,763 ఏకరూప దుస్తుల తయారీకి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా వచ్చేనెల 11లోపు దుస్తుల తయారీ పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ వస్త్రం ఆదివారం జిల్లాకు చేరుకోవడంతో మహిళా సంఘాలపై ఒత్తిడి పెరిగే అవకాశముందని వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి విద్యార్థులకు అందుతాయా? లేదా? అని ప్రశ్నార్థకంగా మారింది. కుట్టు కేంద్రాలలో అధికారులు పర్యవేక్షణ పెంచి తయారీని వేగవంతం చేయాల్సిన అవసరముంది.
జిల్లాలో 72 కేంద్రాల్లో..
జిల్లాలో 380 గ్రామాలతోపాటు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పురపాలికలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో 1417 మంది స్వశక్తి మహిళలతో 72 కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో 840 కుట్టు యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఇందులో పంచాయతీలలో 67 కేంద్రాలను ఏర్పాటు చేసి 988 మంది స్వశక్తి మహిళలను ఎంపిక చేసి 1,20,822 ఏకరూప దుస్తులు, మున్సిపల్ పరిధిలో అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసి 429 మందితో 40,941 దుస్తులను తయారీ చేయనున్నారు. గత ఏప్రిల్లో సెలవులు రాక ముందే స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాట్లు చేశారు. గతంలో ఏజెన్సీ, స్థానిక దర్జీలకు దుస్తులు కుట్టే అవకాశం కల్పించగా ప్రస్తుతం పూర్తిగా స్వశక్తి సంఘాల మహిళలకే కేటాయించారు. కుట్టిన వస్త్రానికి కేవలం రూ.50 చొప్పున మాత్రమే చెల్లించేందుకు నిర్దేశించడంతో గిట్టుబాటు అవ్వడం కష్టంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో స్వశక్తి సంఘాల్లోని మహిళలను అమ్మ ఆదర్శ కమిటీలలో సభ్యులుగా చేర్చడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మహిళల భాగస్వామ్యం పెరనుందని భావిస్తున్నారు.
కుట్టు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు
పాఠశాలల ప్రారంభానికి ముందే..
వస్త్రం అందించడంలో ఆలస్యం కావడంతో ముందుగా ఒక జత అందించేందుకు ప్రతి మండలంలో రెండు నుంచి నాలుగు కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏటా ప్రభుత్వం ఏడాదికి రెండు జతల చొప్పున విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందిస్తున్నారు. ముందుగా ఒక జత అందించేందుకు మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించడమే కాకుండా ఎంఈవో, డీఆర్డీవో, ఏపీఎంలతోపాటు 64 మంది సీసీ క్లస్టర్ల పరిధిలో కుట్టు కేంద్రాలను పర్యవేక్షిస్తూ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏటా అందించే ఏకరూప దుస్తులలో నాణ్యత ఉండకపోవడమే కాకుండా చిన్నపిల్లలకు పెద్ద సైజులో, పెద్ద వారికి చిన్న సైజులో అందించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండేవారు. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణ పెంచి, ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభానికి ముందే అందించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఒక జత అందించేలా చర్యలు
జిల్లా వ్యాప్తంగా సెర్ప్ ద్వారా 67, మెప్మా ద్వారా అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల ద్వారా ఏకరూప దుస్తుల తయారీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జిల్లాకు వస్త్రం చేరుకోవడంతో కుట్టు పనులు ప్రారంభించి, ముందుగా ఒక జత అందించేలా ప్రణాళిక తయారు చేశాం.
మల్లేశం, డీపీఎం, జగిత్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత