పొదుపు పద్దులో అక్రమాలకు అడ్డుకట్ట
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
గ్రామైక్య సంఘాల రుణాల పంపిణీపై ఆరా
లెక్కలు తేల్చే పనిలో ఆడిట్ సిబ్బంది
సుల్తానాబాద్లో దస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారతకు వినియోగించే ప్రతి పైసాకు లెక్క చూపేందుకు కార్యాచరణ చేపట్టింది.
అతివల పొదుపు ప్రాతిపదికన బ్యాంకర్లు లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నారు. సభ్యులు వాటిని నెల వారీ కిస్తుల రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. లింకేజీతో పాటు స్త్రీనిధి, గ్రామైక్య, మండల సమాఖ్యల నుంచి కూడా మహిళలు రుణాలు పొందుతున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో పెద్దగా సమస్య లేదు. గ్రామైక్య, స్త్రీనిధి రుణాలకు మాత్రం ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఆడిటర్లు దస్త్రాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నెలాఖరులోగా శత శాతం ఆడిట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
నెలాఖరులోగా పూర్తికి ఆదేశాలు
గ్రామైక్య సంఘాల రుణాల పంపిణీపై ఆడిటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి వీవోకు అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. క్షేత్ర స్థాయిలో వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) ఆధ్వర్యంలో ఆన్లైన్లో దస్త్రాలను నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల వీవోఏలు, సంఘాల కార్యవర్గ సభ్యులతో కుమ్మక్కై సొమ్ము స్వాహా పర్వానికి పాల్పడుతున్నారు. దీంతో సంఘాల నగదు నిల్వ, జమ, ఖర్చులపై ఆడిటర్లు ఆరా తీస్తున్నారు. ఆన్లైన్లోనూ పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 61 మండల సమాఖ్య, 1,955 గ్రామైక్య సంఘాల పరిధిలో 49,448 స్వశక్తి సంఘాల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నెలాఖరులోపు ఆడిట్ నివేదికలు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కాగా ఆడిట్ ప్రక్రియపై ఎండల తీవ్రత ప్రభావం చూపింది. దస్త్రాల తనిఖీల్లో వ్యత్యాసం ఉంటే ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. అవకతవకలు తేలితే బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంటుంది.
ప్రతి పైసాకూ లెక్క
స్వశక్తి సంఘాల మహిళలు పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఆర్థిక అభ్యున్నతికి మండల, గ్రామైక్య సంఘాలు కూడా రుణాలు ఇస్తున్నాయి. పలు చోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు లింకేజీ రుణాలను నెలవారీగా సంఘం ఖాతాలో జమ చేస్తుండటంతో అక్రమాలకు అవకాశం ఉండదు. మండల సమాఖ్య, గ్రామైక్య సంఘాలకు సంబంధించి డబ్బులు జమ, విడుదల ప్రక్రియలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. వెచ్చించే ప్రతి పైసా వృథా కాకుండా ఆడిటర్లను నియమించి లెక్కలు తీస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాల దస్త్రాలు మండలకేంద్రానికి తెప్పించుకొని ఒకే చోట పరిశీలిస్తూ, లోపాలను గుర్తిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి