గుర్తింపు సరే.. నిధులు ఏవీ?
జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది.
ఎన్క్వాస్ ఆసుపత్రుల ఎదురుచూపులు
మానకొండూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమిది. ఇది 2022 మే నెలలో ఎన్క్వాస్కు ఎంపికైంది. రెండేళ్లు కావస్తున్నా కేంద్రం ప్రకటించిన నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాల్సి ఉంది.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఆ నిధులతో ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరుస్తారు. కానీ రావాల్సిన ప్రోత్సాహకాలు ఏటా విడుదల కాకపోతే ప్రమాణాలు ఎలా మెరుగు పడుతాయనేది గుర్తించడం లేదు. ఇదిలా ఉండగా.. మళ్లీ కొత్త ఆసుపత్రుల ఎంపికకు కసరత్తు చేయడం గమనార్హం. మరిన్ని వివరాలతో కథనం.
కేంద్ర బృందం పరిశీలించి..
ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం, అవసరమైన మందులు నిల్వలు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం వంటి ఎనిమిది విభాగాలను పరిశీలించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్)కు ఎంపిక చేస్తారు. కేంద్ర బృందం వచ్చి ఈ అంశాలను పరిశీలన జరిపి, ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వాటికి మూడేళ్లపాటు ఏటా నిధులు విడుదల చేస్తారు. కానీ రెండేళ్లుగా నిధులు రావడం లేదు. ఆయా ఆసుపత్రుల పరిధిలో వీటిని ఖర్చు చేస్తారు.
రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమిది. 2021లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎన్క్వాస్కు ఎంపికైంది. దీనికి రావాల్సిన ప్రోత్సాహక నిధులు నేటికీ రాలేదు.
ప్రోత్సాహకాలు ఇలా..
- ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏడాదికి రూ.3 లక్షల చొప్పున మూడేళ్లలో రూ.9 లక్షలు కేటాయిస్తారు.
- పట్టణ ఆరోగ్య కేంద్రానికి ఏటా రూ.2 లక్షలు, మూడేళ్లకు రూ.6 లక్షలు ఇస్తారు.
- పల్లె దవాఖానాలు, సబ్సెంటర్లకు ఏటా రూ.1.50 లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తారు.
జిల్లాలో అర్హత సాధించిన ఆసుపత్రులు..
- 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: రామడుగు(డిసెంబరు 2021), చల్లూరు(ఏప్రిల్ 2022), గంగాధర(ఏప్రిల్ 2022), శంకరపట్నం(జనవరి 2023), మానకొండూర్ (మే 2022), కొత్తపల్లి (డిసెంబరు 2022), గుండి (ఏప్రిల్ 2023), తిమ్మాపూర్(ఆగస్టు 2023).
- 7 సబ్సెంటర్లు, పల్లె దవాఖానాలు: ఎలబాక, దుర్శేడ్(సెప్టెంబరు 2023), కొండ పలకల, ములకనూర్ (నవంబర్ 2023), జమ్మికుంట-2(అక్టోబరు 2023), బూరుగుపల్లి(మార్చి 2024), అన్నారం (ఫిబ్రవరి 2024)కేంద్రాలు ఉన్నాయి.
- పట్టణ ఆరోగ్య కేంద్రాలు: కరీంనగర్లోని మోతాజ్ఖాన(జూన్ 22), బుట్టిరాజరాంకాలనీ(ఫిబ్రవరి 23) ఆరోగ్య కేంద్రాలు ఎంపికయ్యాయి.
- వీటిలో గంగాధర, చల్లూరు, శంకరపట్నం, బుట్టిరాజరాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రానికి మాత్రమే ప్రోత్సాహక నిధులు వచ్చాయి. మిగతా వాటికి రాలేదు.
- ఎంపిక కోసం ముస్తాబు : వీణవంక, చిగురుమామిడి, చామన్పల్లి ఆరోగ్య కేంద్రాలు, ఎరడపల్లి, గన్నేరువరం, గర్షకుర్తి పల్లె దవాఖానాలు ఎన్క్వాస్ ఎంపికకు ముస్తాబవుతున్నాయి.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
జిల్లాలో ఎన్క్వాస్కు ఎంపికైన ఆసుపత్రులకు రావాల్సిన ప్రోత్సాహకాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కొన్నింటికి విడుదల చేశారు. మిగిలిన వాటికి నిధుల విడుదలయ్యే అవకాశముంది. వీటితో సంబంధం లేకుండా కొత్త ఆసుపత్రుల ఎంపిక కోసం చర్యలు చేపట్టాం.
డాక్టర్ సుజాత, డీఎంహెచ్వో, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం