ప్రాదేశిక సమరంపై సందిగ్ధత
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది.
జులై 4తో ముగియనున్న సభ్యుల కాలపరిమితి
ఎన్నికల ఏర్పాట్లపై యంత్రాంగానికి అందని ఆదేశాలు
ఈనాడు, కరీంనగర్
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. మరో నెలన్నర రోజుల్లో ప్రస్తుత సభ్యుల పదవీ కాలం గడువు ముగియనుండగా ఇప్పటివరకు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల విషయంలో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.
అయిదేళ్ల కిందట ప్రాదేశిక ఎన్నికల సమయంలో దాదాపు మూడు నెలల ముందు నుంచే ఉమ్మడి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు కనిపించాయి. ఈసారి పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కాగా ఇటీవల అధికారులు ముందస్తు ఏర్పాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అవసరమైన విధి విధానాలపై దృష్టి సారించారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు సంబంధించి మాత్రం ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుత ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాతే ఎన్నికల తంతు ప్రారంభం కానుంది. అదే జరిగితే మండల, జిల్లా పరిషత్తులూ ప్రత్యేక అధికారుల పాలనలోకి వస్తాయి.
నాడు రెండు నెలల తర్వాతే బాధ్యతలు
ప్రాదేశిక నియోజకవర్గాల ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి జులై 4తో ముగియనుంది. 2019లో మే నెలలోనే పోలింగ్ పూర్తి చేయగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు జులై 5న ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లోనూ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఎన్నికయ్యారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించింది. అయితే మే నెలలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలుండటంతో గెలిచిన వారు బాధ్యతలు చేపట్టేందుకు సమయం తీసుకోవాల్సి వచ్చింది.
పాత రిజర్వేషన్ల వర్తింపుపై ఉత్కంఠ
జులైలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈపాటికే జిల్లాల్లో ఓటరు ముసాయిదా జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ బూత్ల ఎంపిక, సామగ్రి సమకూర్చుకోవడం తదితర ప్రక్రియకు సంబంధించి సిద్ధమవ్వాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో మరో మూడు నెలల పాటు ప్రాదేశిక పోరు ఉండదనేది స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకే మూడు విడతల సమయం పడుతుంది. వాటి తరువాత ప్రాదేశిక పోరు నిర్వహించాలన్నా ఏర్పాట్లకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలి. మరోవైపు రిజర్వేషన్ల ఖరారులోనూ స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించడం, కొత్త మండలాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మార్చాల్సి ఉండటంతో సందిగ్ధం నెలకొంది. గత ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు రెండు పర్యాయాలు వర్తిస్తాయని చెప్పడంతో ఈసారి నిర్ణయంపై ఆశావహ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే