పొదుపు చేద్దాం.. గృహజ్యోతిని వెలిగిద్దాం
నగరానికి చెందిన గౌతం కుటుంబం ఏప్రిల్లో 202 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకోవడంతో గృహజ్యోతి పథకం వర్తించలేదు. దీంతో రూ.1100లకు పైగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది.
విద్యుత్తు ఆదాపై దృష్టి అవసరం
న్యూస్టుడే, భగత్నగర్
నగరానికి చెందిన గౌతం కుటుంబం ఏప్రిల్లో 202 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకోవడంతో గృహజ్యోతి పథకం వర్తించలేదు. దీంతో రూ.1100లకు పైగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది.
గృహజ్యోతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు.. ఆ లోపు విద్యుత్తు వాడిన గృహ వినియోగదారులకు జీరో బిల్లు అవకాశం ఇస్తోంది. ఒక్క యూనిట్ ఎక్కువైనా ఈ పథకం వర్తించదు. పై ఘటనలో వినియోగదారుడు రెండు యూనిట్లు అదనంగా వాడుకోవడంతో రూ.1100 ఖర్చు చేయాల్సి వచ్చింది. అవగాహన లేక.. ఆపై వేసవికావడంతో ఇష్టారీతిగా విద్యుత్తు వినియోగిస్తూ జీరో బిల్లుకు దూరమవుతున్నారు. దీనికి అర్హత పొందాలంటే విద్యుత్తు పొదుపు చేయడమే మార్గం. అటు కాలుష్యాన్ని తగ్గించిన వారవుతారూ.. ఇటు ఆర్థిక భారం తగ్గుతుంది.
తగ్గిన లబ్ధిదారులు
వేసవి కావడంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగించడంతో విద్యుత్తు బిల్లు పెరిగి పథకానికి దూరమవుతున్నారు. గత నెలలో 1,34,554 మంది వినియోగదారులకు జీరో బిల్లు వస్తే.. ఈ నెలలో 1,28,921 మందికే వచ్చింది. అంటే 5,633 మంది వినియోగదారులు పథకం రాయితీకి దూరమయ్యారు.
ఇలా చేస్తే మేలు..
- ప్రజలు పాతకాలం నాటి ఫ్లోరోసెంట్ బల్బులు వాడటంతో కరెంట్ వినియోగం పెరుగుతుంది. వీటికి బదులు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్లైట్లను వినియోగించడం మేలు. వీటితో విద్యుత్తును పొదుపు చేయొచ్చు. ఫ్లోరోసెంట్ బల్బుల సామర్థ్యం 40 వాట్స్ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశముంది.
- ఏసీలు మైనస్ 24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతోపాటు బిల్లు ఆదా అవుతుంది. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెంచినా ఆరు శాతం విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్తో కూడిన ఏసీలు లభిస్తున్నాయి. ఇవి గది చల్లబడగానే ఆటోమెటిక్గా ఆఫ్ అవుతాయి. సాధారణ ఏసీలు పునః ప్రారంభమయ్యే సమయంలో భారం పడుతుంది. ఇది విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇన్వర్టర్స్తో కూడిన ఏసీలతో ఈ ఇబ్బంది తొలిగి కొంత విద్యుత్తు పొదుపు అయ్యే అవకాశముంది.
- సీజన్ మేరకు ఫ్రీజ్లో ఫ్రీజర్ దశలు మార్చుతూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. మంచు పొరలు పావు వంతు పెరిగినట్లు గమనిస్తే వెంటనే డిఫ్రోస్ట్ అనే ఆప్షన్ ద్వారా తొలగించాలి.
- ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్ఈడీ బల్బులు, రిఫ్రిజిరేటర్లు తదితర విద్యుత్తు గృహోపకరణాలు బీఈఈ రేటింగ్ 1 నుంచి 6 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిల్లో 5 స్టార్ అంతకు మించి ఉంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతూ బిల్లు ఆదా అవుతుంది. కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరంలేని సమయంలో స్విచ్ఛాఫ్ చేయాలి. ఛార్జింగ్ పూర్తయ్యాక ప్లగ్ నుంచి ఛార్జర్ను తొలగించాలి.
స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు
గృహజ్యోతి పథకానికి వినియోగదారులు వారి నివాస ప్రాంతం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. నగర పాలక, పురపాలక సంస్థలు, ఎంపీడీవో కార్యాలయం దేని పరిధిలో నివాసముంటే అక్కడ దరఖాస్తు చేయొచ్చు.
వడ్లకొండ గంగాధర్, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్