సర్కారు బడుల్లో సాంకేతిక సేవలు
ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక సేవలకు పెద్దపీట వేస్తున్నారు. ఆధునిక విద్యా బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు ముఖ గుర్తింపు(ఫేషియల్ రికగ్నయిజ్డ్ అటెండెన్స్), యూడైస్ విద్యా సమాచారం, డిజిటల్ తరగతులు, పాఠశాలల అభివృద్ధి నిధుల వివరాల నమోదులో పారదర్శకత పెంచారు.
ఈ ఏడాది నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానం
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్లు, సిమ్లు పంపిణీ
మంథని మండలం గద్దలపల్లి ఉపాధ్యాయుడికి సిమ్తో కూడిన ట్యాబ్ అందజేస్తున్న అధికారి
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక సేవలకు పెద్దపీట వేస్తున్నారు. ఆధునిక విద్యా బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు ముఖ గుర్తింపు(ఫేషియల్ రికగ్నయిజ్డ్ అటెండెన్స్), యూడైస్ విద్యా సమాచారం, డిజిటల్ తరగతులు, పాఠశాలల అభివృద్ధి నిధుల వివరాల నమోదులో పారదర్శకత పెంచారు. ఇందుకోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది ట్యాబ్లు సరఫరా చేయగా ఇటీవల వాటి నిర్వహణకు కొత్త సిమ్ కార్డులు అందజేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సేవలు ఆన్లైన్లో నిక్షిప్తం కానున్నాయి. అంతర్జాల సమస్య తొలగడంతో సాంకేతిక పరికరాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి.
డిజిటల్ బోధనకు మార్గం
సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 393 ట్యాబ్లు, సిమ్కార్డులు పంపిణీ చేశారు. సర్కారు బడుల్లో సాంకేతిక విద్యా బోధనకు ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ‘మన ఊరు-మన బడి’లో ఎంపికైన పాఠశాలల్లో డిజిటల్ తెరలతో బోధన సాగుతోంది. కొన్ని చోట్ల అంతర్జాల సమస్య ఎదురవడంతో డిజిటల్ తరగతుల నిర్వహణ సక్రమంగా అమలు కావడం లేదు. మరికొన్ని చోట్ల పరికరాలు అలంకారప్రాయంగానే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఇబ్బందికరంగా మారింది. ఎట్టకేలకు ట్యాబ్లకు సిమ్కార్డులు రావడంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. పాఠ్యాంశాలకు సంబంధించి లోతైన విజ్ఞానం విద్యార్థులకు అందనుంది. ప్రయోగ పాఠాలపై పట్టు సాధించనున్నారు.
అన్ని వివరాలూ ఆన్లైనే..
ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతతో వివరాల నమోదుకు కాలం చెల్లింది. యూడైస్, విద్యా కార్యక్రమాల వివరాలు, విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు, ఉన్నతి సామర్థ్యాల నివేదికలు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సంఖ్య, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, బడిబాట, నిర్వహణ నిధులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. వీటితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. గతేడాది చాలా చోట్ల విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేసినప్పటికీ కొన్ని చోట్ల ఆచరణకు నోచుకోలేదు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ముఖ గుర్తింపు హాజరు అమలు చేసేందుకు ట్యాబ్లకు సిమ్ కార్డులు అందజేశారు.
పకడ్బందీగా అమలు చేస్తాం
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవల అమలు కోసం ట్యాబ్లు, సిమ్ కార్డులను పంపిణీ చేశాం. విద్యా నివేదికలు, హాజరు ఇతర వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం కానున్నాయి.
మాధవి, జిల్లా విద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ