వృత్తి నైపుణ్యం.. మార్కెటింగ్ వ్యూహం
ఒకప్పుడు జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండేది. ప్రభుత్వ ఆర్డర్ల కేటాయింపులు, వాటిలోనూ పూర్తిగా పాలిస్టర్వి కావడంతో తొమ్మిదేళ్లు కాటన్ పరిశ్రమ కుదేలైంది.
సొంతంగా ఆర్డర్లు తెచ్చుకుంటున్న నేతన్నలు
మరమగ్గాలపై దోమ తెరల ఉత్పత్తులు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల : ఒకప్పుడు జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండేది. ప్రభుత్వ ఆర్డర్ల కేటాయింపులు, వాటిలోనూ పూర్తిగా పాలిస్టర్వి కావడంతో తొమ్మిదేళ్లు కాటన్ పరిశ్రమ కుదేలైంది. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రోత్పత్తులతో రాష్ట్రంలో సిరిసిల్లకు ప్రైవేటు మార్కెట్ తగ్గింది. పరోక్షంగా వస్త్రపరిశ్రమలో సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత జౌళిశాఖ ఉత్పత్తి వైవిధ్యాన్ని (ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్) ప్రోత్సహించేలా నిపుణులతో అధ్యయనం చేయించి, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలు సూచించాలి. కానీ ఈ పద్ధతి చేనేతలోనే ఉంది. మరమగ్గాల్లో లేదు. దీంతో జిల్లా నేతన్నలు ప్రైవేటు ఉత్పత్తులతో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. మార్కెట్లో డిమాండ్, వస్త్రోత్పత్తుల్లో నైపుణ్యంతో ఇప్పటికే ముఫ్పై శాతం మంది సొంత ఉత్పత్తులను ప్రారంభించారు.
పేరుతో నేసిన కండువా
ప్రభుత్వ ఆర్డర్ల కోసం అయిదు నెలలుగా ఆసాములు, కార్మికుల ఎదురుచూపులతోనే కాలం కరిగిపోయింది. తొమ్మిదేళ్లలో మరమగ్గాలకు డాబీ, జకార్డులు అమర్చుకోవడంతోపాటు వాటితో వివిధ రకాల డిజైన్లతో ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆ నైపుణ్యమే ఇప్పుడు ప్రైవేటు ఆర్డర్లతో కొంత మేరకు ఆదుకుంటోంది. తువాళ్లు, చేతిరుమాళ్లు, లుంగీలు, దోమతెరలు, కండువాలు, టెంటుకు ఉపయోగించే వస్త్రం వంటి తదితర ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో కొందరు సొంతంగా వస్త్రోత్పత్తులు తయారు చేసుకుని చుట్టుపక్కల జిల్లాల్లో మార్కెట్లకు వెళ్లి విక్రయాలు చేస్తున్నారు. స్థానిక ఉత్పత్తులకు తోడు మహారాష్ట్ర, సూరత్, చెన్నైల నుంచి కాటన్, పాలిస్టర్ ఆర్డర్లు వస్తున్నాయి. రెండు నెలలుగా జిల్లా పరిశ్రమలో 30 శాతం పరిశ్రమ వర్గాలు సొంత మార్కెటింగ్ వైపు వెళ్లడంతో ఆసాములు, కార్మికుల జీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇంకా సగానికిపైగా ఆసాములు, కార్మికులకు ఉపాధి లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
నవీకరణతోనే మనుగడ
ప్రభుత్వ ఆర్డర్లు అనేవి ఎప్పుడూ ఉంటాయనే నమ్మకంతో ఉంటే ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించాను. నాకున్న 12 సాంచాలపై ఎలాంటి ఉత్పత్తులనైనా చేసేలా నవీకరణ చేసుకున్నాను. వ్యాపారులు తమకు అవసరమైన కాటన్ ఉత్పత్తుల ఆర్డర్లు ఇస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేసి ఇస్తున్నాను. నాతోపాటు మరో ముగ్గురు కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
మారుతి, ఆసామి, పద్మనగర్, సిరిసిల్ల
ముడి సరకుతో ఆసాములకు ఉపాధి
నేను వరుసగా నాలుగేళ్లు బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశాను. ప్రభుత్వ ఆర్డర్లు జనవరిలోనే రావాల్సి ఉండేది. వాటికోసం వేచిచూడకుండా ముడి సరకు తెచ్చుకుని సొంతంగా ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాను. ఇలా ఉత్పత్తి చేసిన వాటిని కరీంనగర్, వరంగల్ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. అక్కడి ఉత్పత్తులకు భిన్నంగా చేయాలనే ఆలోచనతో నాతో పాటు మరో పదిహేను మంది ఆసాములకు ముడిసరకు ఇచ్చి వస్త్రోత్పత్తులు నేయిస్తున్నాను. ఇప్పటికే దాదాపు 70 మగ్గాలపై 30 మంది కార్మికులకు నాలుగు నెలలుగా ఉపాధి లభిస్తుంది.
వంగ రవీందర్, ఆసామి,జేపీనగర్, సిరిసిల్ల
వచ్చిన పని చేయడం ఉత్తమం
- తొర్ర రవి, కార్మికుడు, రాజీవ్నగర్
నేను పని చేస్తున్న కార్ఖానాలో మా యజమాని ప్రైవేటు ఆర్డర్లు తీసుకొచ్చారు. వాటితో మూడు నెలలుగా ఉపాధి పొందుతున్నాను. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో రోజుకు సుమారు రూ.900 వరకు కూలి గిట్టుబాటు అయ్యేది. ఈ ఉత్పత్తులతో రూ.600 వరకు లభిస్తుంది. ప్రభుత్వ ఆర్డర్ల కోసం వేచిచూడటం కన్నా ఇదే నయం. నాతో పాటు పని చేసే చాలా మంది కార్మికులు నెలల తరబడి పని లేక ఖాళీగా ఉన్నారు.
దోమతెరల ఆర్డర్లు వస్తున్నాయి
ప్రభుత్వ ఆర్డర్లనే పూర్తిగా నమ్ముకుంటే ఎప్పుడో ఒకసారి పస్తులు తప్పవని ముందే గ్రహించాను. మా యజమాని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దోమతెరల ఆర్డర్లు తీసుకొచ్చి ఇస్తుంటారు. ఆరు మగ్గాలపై నేను, నా భార్య ఇద్దరం రెండు షిప్టుల్లో ఉత్పత్తి చేస్తాం. ఏడాదిలో రెండు నెలలు కొద్దిగా తక్కువ ఉంటుంది. రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా పని లభిస్తోంది.
- ఎనుగుల లక్ష్మణ్, ఆసామి, రాజీవ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి