పంచాయతీలకు నిధుల లేమి!
నిధుల లేమితో గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకంగా మారుతోంది. సర్పంచుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2తో ముగిసిపోగా నాలుగు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది.
అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకం
మానకొండూర్లో రోడ్డు పక్కన చెత్త
న్యూస్టుడే, కరీంనగర్ కలెక్టరేట్: నిధుల లేమితో గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకంగా మారుతోంది. సర్పంచుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2తో ముగిసిపోగా నాలుగు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. వీరి పాలనకు ముందే పంచాయతీ ఖాతాలు ఖాళీ అయ్యాయి. సర్కారు నుంచి కొన్ని నెలలుగా నిధులు జమ కాకపోవటంతో పాలన మొక్కుబడిగా సాగుతోంది. కొందరు గ్రామ కార్యదర్శులు అక్కడక్కడా జేబు నుంచి పెట్టి చిన్నచిన్న పనులను లాక్కొస్తున్నారు. రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే ప్రజలు జబ్బుల బారిన పడే అవకాశముంది.
చేతులెత్తేసిన ప్రత్యేకాధికారులు..
పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, పైపుల లీకేజీకి మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు పంచాయతీ ట్రాక్టర్ నెలవారి బ్యాంకు వాయిదా, గ్రామంలో విద్యుద్దీపాలు, నెలనెలా విద్యుత్తు బకాయిలు.. ఇవ్వన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేక అధికారులు చేతులెత్తేసే తరహాలో ఉండటంతో గ్రామ కార్యదర్శులే భుజాన వేసుకొని వారికి వచ్చే జీతంలో కొద్దో, గొప్పో కార్మికులకు సగం సగం జీతం సర్దుబాటు చేస్తున్నట్లు కరీంనగర్ గ్రామీణ మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే ఒక్కో గ్రామ పంచాయతీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అప్పు చేసి ఖర్చు చేసినట్లు సమాచారం. పంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చుల విషయంలో చేతులెత్తేస్తుండటంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. నాలుగు రోజులు ఉండి పోయే వాళ్లమని ప్రత్యేక అధికారులు దాట వేస్తున్నారని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాతాలు ఖాళీ..
గ్రామ పంచాయతీకి మూడు రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి ఆస్తి పన్ను జమ చేసుకునే ఖాతా... గ్రామాల్లో ఆస్తి పన్ను వసూలు అంతంత మాత్రంగా జరగటం, ఖర్చులు నాలుగింతలు ఉండటంతో ఇది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. రెండో ఖాతా ఎస్ఎఫ్సీ (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు జమ చేస్తారు. ఈ రెండు ఖాతాల్లో జమయ్యే మొత్తం ట్రెజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. కానీ గత సర్కారు హయాంలో ఎస్ఎఫ్సీ నిధులు అరకొర మంజూరుతోనే సరిపెట్టింది. మూడో ఖాతా.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇందులో జమ అవుతాయి. కేంద్ర సర్కారు నేరుగా పంచాయతీలకు గ్రామ జనాభా ప్రాతిపదికన జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకోసారి వీటిని అందజేస్తోంది. కేవలం ఈ నిధులు మాత్రమే పంచాయతీలకు అందుతుండటం.. వీటిని ప్రత్యేక పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ఖర్చు చేయని నిధులు ఆయా ఖాతాల్లో మిగిలిపోగా మార్చిలో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.
నేటికీ బిల్లులు చెల్లించలేదు
పంచాయతీల పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేశాం. వాటి బిల్లులు నేటికీ అందలేదు. ట్రాక్టర్ బ్యాంకు రుణ వాయిదాలు, డీజిల్ బిల్లులు చాలా పంచాయతీలు చెల్లించలేదు.
జక్కం నర్సయ్య, మాజీ సర్పంచి, మొగ్దుంపూర్, కరీంనగర్ గ్రామీణం
త్వరలో సమస్య పరిష్కారం
క్షేత్రస్థాయిలో కొంత సమస్య ఉన్న వాట వాస్తవమే. ఏడాదిన్నరగా ఎస్ఎఫ్సీ నిధులు అందలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తోంది. జూన్లో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.
రాంబాబు, డీఎల్పీవో, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు