అక్రమాల ఆట.. కాసుల వేట!
కరీంనగర్లోని ఓ క్రీడా దుకాణానికి ఇద్దరు వ్యక్తులు ఇలా క్యారమ్ బోర్డులను మెట్లెక్కి తీసుకెళ్తున్నారు. జిల్లా యువజన, క్రీడల కార్యాలయానికి సంబంధించిన వీటిని దొడ్డిదారిన అందులోని సిబ్బంది విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చేయని పనికి వేతనం
పక్కదారి పడుతున్న సామగ్రి?
కరీంనగర్లోని ఓ క్రీడా దుకాణానికి ఇద్దరు వ్యక్తులు ఇలా క్యారమ్ బోర్డులను మెట్లెక్కి తీసుకెళ్తున్నారు. జిల్లా యువజన, క్రీడల కార్యాలయానికి సంబంధించిన వీటిని దొడ్డిదారిన అందులోని సిబ్బంది విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణంలో నుంచి కొనుక్కొచ్చే వారు కిందకు దిగుతూ వస్తారు. కానీ వీరు అందుకు భిన్నంగా పైకి తీసుకెళ్తున్నారు. పైగా క్రీడాశాఖకు సంబంధించిన సామగ్రి ఎన్నడూ ఇలా ఒక్కోటి వచ్చిన దాఖలాలు లేవు. కొటేషన్ ఇచ్చిన దుకాణం నుంచే నేరుగా ప్యాకింగ్ రూపంలో సామగ్రి కార్యాలయానికి వస్తుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నదాన్ని బట్టి క్యారమ్ బోర్డులు విక్రయానికి తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
హాజరు రిజిస్టర్లో సగం రోజులే పనిచేసిన ఆధారాలిలా..
జిల్లా యువజన, క్రీడల కార్యాలయంతోపాటు అంబేడ్కర్ మైదానంలో స్విమ్మింగ్ ఫూల్లో ఊడ్చేందుకు కొన్నాళ్ల కిందట ఓ వ్యక్తిని విధుల్లోకి తీసుకున్నారు. ఆయన మార్చి నెలలో కేవలం 10 రోజులు మాత్రమే విధుల్ని నిర్వర్తించారు. వేతనం మాత్రం నెల రోజులకు రూ.7,800లు చెల్లించారు. ఇలా పూర్తి వేతనం ఇచ్చినందుకుగానూ ఆయనకు కార్యాలయం సిబ్బంది ఒకరు ఫోన్ చేసి సగం డబ్బులను తన బ్యాంక్ ఖాతాకు మళ్లించాలని డిమాండ్ చేయడం, ఆ ఉద్యోగి రూ.3 వేలు మాత్రమే చెల్లిస్తానన్న ఆడియో బయటకు వచ్చింది.
ఈనాడు, కరీంనగర్: జిల్లా క్రీడా శాఖలో రోజుకో వివాదం ఆ శాఖ ప్రతిష్ఠను దిగజారుస్తోంది. క్రీడాకారుల భవిష్యత్తుకన్నా.. తమకేంటి లాభమనే పంథాతో కొందరు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకు మచ్చ తెస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుండటం, ఇక్కడ ఏళ్ల తరబడి పనిచేసిన కొందరి ఆధిపత్యమే కొనసాగుతుండటంతో కొన్ని విషయాల్లో వారు ఆడిందే ఆటగా మారిపోయింది. అధికారులు మారుతున్నా.. ఆరోపణలు ఆగడం లేదు.
అసలేం జరుగుతోంది..?
జిల్లా యువజన, క్రీడల కార్యాలయం పరిధిలో అంబేడ్కర్ మైదానంతోపాటు స్విమ్మింగ్ ఫూల్, క్రీడా పాఠశాల, క్రీడా మైదానాల నిర్వహణ సహా అప్పుడప్పుడు పలు టోర్నీలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అడపాదడపా వస్తున్న నిధుల వినియోగం విషయంలో తరచూ ఆరోపణలు వస్తున్నాయి. పైగా తాత్కాలిక సిబ్బంది పని చేయకున్నా వారికి పూర్తి వేతనాలు చెల్లిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత నెలలో ఓ ఉద్యోగికి చెల్లించిన వేతనంపై రగడ జరుగుతోంది. అవసరమైన క్రీడా సామగ్రిని గతంలో ఒక దుకాణం నుంచే కొన్నారనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఇటీవల నగరంలోని ఓ దుకాణంలో ఇక్కడి క్రీడా పరికరాల్ని అమ్ముకున్నారనే ఆరోపణలు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. గతంలోనూ ఇక్కడ జరిగిన పలు అభివృద్ధి పనుల విషయంలోనూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిధుల ఖర్చు విషయంలోనూ లెక్కాపత్రం సరిగ్గా ఉండటం లేదని ఆరోపణలున్నాయి. కాని కఠిన చర్యలు లేకపోవడంతో కొద్ది రోజులకే మరో వివాదం వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
విచారణ జరుపుతాం
ఇటీవలే నాకు ఈ విషయాలపై ఫిర్యాదులు అందాయి. తక్షణమే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. క్రీడా దుకాణానికి క్యారమ్స్ తీసుకెళ్తున్న వారు మా సిబ్బందిలాగే ఉన్నారు. ఒకవేళ ఏవైనా సామగ్రి బాగాలేకుంటే మార్చడానికి తీసుకెళ్లారా.. కారణమేంటనేది విచారణ చేయిస్తాను. ఇది ఇటీవల జరిగింది కాదు. నేను నెల రోజుల కిందటే బాధ్యతలు చేపట్టాను. సిబ్బంది తక్కువగా ఉండటంతో కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నా.. సేవల పరంగా ఎక్కడ లోటుపాట్లు లేకుండా శ్రద్ధను కనబరుస్తున్నాం. ఇక మీదట పర్యవేక్షణ పెంచుతా.
శ్రీకాంత్రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?