కుక్క కాటు బాధితులు ఏటా 25వేలు
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆస్పత్రికి గత నెల రోజుల్లో దాదాపు 127 మంది కుక్క కాటు చికిత్స కోసం వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామసింహాల బారిన పడి రోజుకు సగటున 50 నుంచి 100 మంది ప్రభుత్వాసుపత్రుల మెట్లెక్కుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు
అందుబాటులో వ్యాక్సిన్
ఈనాడు, కరీంనగర్
- కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆస్పత్రికి గత నెల రోజుల్లో దాదాపు 127 మంది కుక్క కాటు చికిత్స కోసం వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామసింహాల బారిన పడి రోజుకు సగటున 50 నుంచి 100 మంది ప్రభుత్వాసుపత్రుల మెట్లెక్కుతున్నారు.
- గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు 1,316 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ నెలలో వందకుపైగా కేసులొచ్చాయి.
- కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో 2023లో 2,297 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రోజుకు సగటున 76 మంది కుక్క కాటుకు చికిత్స కోసం ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.
- జగిత్యాల జిల్లాలో గడిచిన ఏడాది కాలంగా 4,761 మందికి 23,505 యాంటీ రేబిస్ వ్యాక్సిన్లను ఇచ్చారు. కుక్కతోపాటు కోతి, పిల్లి ఇతర జీవాలు కరిచాయని బాధితులు జిల్లాసుపత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది 2,170 మంది కుక్కకాటుతో, 522 మంది కోతి చేసిన గాయం వల్ల వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు.
- నాలుగు నెలల కిందట గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో ఓ చిన్నారిని కుక్క కరవడంతో ఆస్పత్రి పాలైంది. పది రోజులపాటు అక్కడ చికిత్సనందుకుని ఇంటికొచ్చిన తరువాత చనిపోయింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే దమ్మన్నపేటలో ఓ వృద్ధురాలిని కరవడంతో ఆమె కూడా చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయింది.
వ్యాక్సిన్
అవగాహన కల్పిస్తూ..
జిల్లా, ప్రాంతీయ, ప్రాథమిక, బస్తీ, పల్లె దవాఖానాల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు సమృద్ధిగానే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కేసులు ఏ ఆస్పత్రి పరిధిలో ఎక్కువగా వస్తున్నాయో.. అక్కడ వీటిని అందుబాటులో ఉంచారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహనను కల్పిస్తున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లి నిర్ణీత డోసులను తీసుకుంటుండటంతో చాలా మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి కుక్క కాటు ప్రమాదకరంగా మారి ప్రాణాల్ని బలిగొంటోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో ఏడాదికి అయిదారు మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆస్పత్రులకు వరుస..
ఉమ్మడి జిల్లాలో కుక్కకాట్లు పెరుగుతుండటంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వినియోగమూ పెరుగుతోంది. ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో సగటున 10 నుంచి 40 మందిని ఒకటే కుక్క కరిచిన ఉదంతాలు ఉంటున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధితో సంభవిస్తున్న మరణాల జాబితాలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే తరహాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. సగటున ఏడాదికి 20వేల మంది వరకు కుక్క కాటుకు సంబంధించిన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య దాదాపుగా 5 నుంచి 8 వేల వరకుంటుందని అంచనా. అయిదేళ్ల కిందటితో పోలిస్తే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. శునకాలకు కు.ని. శస్త్రచికిత్సలు మొక్కుబడిగా జరుగుతుండటం వల్ల వాటి సంతతి పెరుగుతోంది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడం వల్ల కరిచిన వారికి ప్రాణాంతకమవుతోంది. పంచాయతీ మొదలు పుర, నగరపాలక సంస్థల్లో శునకాల నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియను అంతగా పట్టించుకోకపోవడంతో ప్రజలు వీధుల్లో భయం భయంగా నడవాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం